PM Narendra Modi : పాక్ పై మరోసారి నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ

పాకిస్థాన్ ఆర్మీ తమకు రక్షణగా ఉందని ఉగ్రవాదులు భావిస్తున్నారని తెలిపారు...

Narendra Modi : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తామని బిహార్ పర్యటనలో భాగంగా ఈ గడ్డపై నుంచి గతంలో తాను ఇచ్చిన హామీ నేరవేర్చానని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బిహార్‌ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఆయన కరకట్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముడు ఒక్కసారి మాట ఇచ్చారంటే.. దానికి కట్టుబడి ఉంటారన్నారు. అదే విధానాన్ని తాము అనుసరిస్తున్నట్లు తెలిపారు.

Narendra Modi Strong Warning to Pakistan

పహల్గాం ఉగ్రదాడి జరిగిన రెండో రోజు అంటే మే 24వ తేదీ ప్రధాని మోదీ(Narendra Modi) బిహార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తామంటూ బిహార్‌లోని మధుబన్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ ప్రకటించారు. నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ వాగ్దానం చేసిన 35 రోజులకు మళ్లీ తాను బిహార్‌కు వచ్చానని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు.

మన మహిళ సిందూరం శక్తి ఎలా ఉంటుందో పాకిస్థాన్ చూసిందని అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ తమకు రక్షణగా ఉందని ఉగ్రవాదులు భావిస్తున్నారని తెలిపారు. వారికి సైతం భారత్ దెబ్బ ఎలా ఉంటుందో రూచి చూపించామని చెప్పారు. అంతేకాదు.. పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టామని ప్రధాని మోదీ(Narendra Modi) గుర్తు చేశారు. ఇది నయా భారత్ శక్తి అంటూ ప్రధాని మోదీ అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌కు భారత్ శక్తి బాగా అర్థమైందన్నారు. అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ జరుపుతోన్న పోరు ఆగలేదని స్పష్టం చేశారు. మరోసారి ఈ తరహా దాడి జరిగితే మాత్రం పాము తలను నాశనం చేస్తామని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్‌ను ప్రధాని మోదీ పరోక్షంగా హెచ్చరించారు.

మరికొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వరుసగా మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఎన్డీయే కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జేడీ యూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 80 స్థానాలను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇవే ఎన్నికల్లో జేడీయూ 45 స్థానాలకు కైవసం చేసుకుంది. మిత్ర ధర్మంలో భాగంగా సీఎం పదవి నితీశ్ కుమార్ చేపట్టారు. అదీకాక.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 29 స్థానాలను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు గెలుచుకున్న విషయం విదితమే.

Also Read : Nadendla Manohar : 2047 నాటికీ 2.4 ట్రిలియన్ డాలర్ ఎకనామిగా చేయడమే మా లక్ష్యం

Leave A Reply

Your Email Id will not be published!