Pregnant Woman: విశాఖలో దారుణం ! నిండు గర్భిణి దారుణ హత్య !
విశాఖలో దారుణం ! నిండు గర్భిణి దారుణ హత్య !
Pregnant Woman : విశాఖపట్నంలోని పీఎం పాలేం ఉడా కాలనీలో దారుణం జరిగింది. మరి కొన్ని రోజుల్లో ప్రసవం కావాల్సిన భార్యను భర్తే గొంతు నులిమి చంపాడు. ముందుగా తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ… ఆపై నేరాన్ని ఒప్పుకుని పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Pregnant Woman Killed by Husband
పీఎం పాలెంలోని(PM Palem) ఉడా కాలనీలో జ్ఞానేశ్వర్, అనూష దంపతులు నివాసం ఉంటున్నారు. మూడేళ్ల క్రితం ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. జ్ఞానేశ్వర్ ఫాస్ట్ఫుడ్ సెంటర్ ను నిర్వహిస్తుండగా… అతని భార్య అనుష ఎనిమిదో నెల గర్భవతి. మరికొన్ని రోజుల్లో డెలివరీ కావాల్సి ఉంది. ఈ తరుణంలో సోమవారం ఉదయం అనూషకు ఆరోగ్యం బాగోలేదని జ్ఞానేశ్వర్… ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు విగత జీవిగా ఉన్న అనూషను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అనూష మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అనూష మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
ఏదో విషయంలో సోమవారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జ్ఞానేశ్వర్… ఆమె గొంతు గట్టిగా నొక్కేశాడు. దీనితో ఆమె ఊపిరి అందక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే స్థానికుల సాయంతో ముందుగా ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి కేజీహెచ్కు అతడే తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే జ్ఞానేశ్వర్ తీరుపై అనూష కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో… నిజాన్ని అంగీకరించాడు. పోలీసుల విచారణలో తనకు, తన భార్య అనుషకు మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ సమయంలో భార్య అనుషను గొంతు నులిమి హత్య చేసినట్లు భర్త జ్ఞానేశ్వర్ పీఎం పాలెం పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు. దీనితో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read : YSRCP: ‘వక్ఫ్’ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ