Droupadi Murmu: మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము !

మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము !

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఆమె మెట్రోలో ప్రయాణం చేసారు. కశ్మీరీ గేట్‌- రాజా నహర్‌ సింగ్‌ (బల్లభ్‌గఢ్‌) కు టిక్కెట్టు తీసుకుని ఆమె తన సెక్యూరిటీ సిబ్బందితో సహా మెట్రో రైలులో ప్రయాణం చేసారు. ఈ ప్రయాణంలో మెట్రో రైలులో ఉన్న పాఠశాల విద్యార్థులతో ఆమె ముచ్చటించారు. వారి భవిష్యత్తు ప్రణాళికలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షల సమయం కావడంతో ధైర్యంగా ఉండాలని, ఒత్తిడికి లోనుకాకుడదని వారికి సూచించారు. పరీక్షల్లో మంచి ప్రతిభ చూపేందుకు విద్యార్ధులకు పలు సూచనలు చేశారు. ఆ తరువాత పలువురు సాధారణ ప్రయాణికులతో కూడా ఆమె మాట్లాడారు.

Droupadi Murmu Travel in Metro

రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి మెట్రో ప్రయాణం చేసిన ద్రౌపదీ ముర్ముకు… డీఎంఆర్‌సీ ఎండీ వికాస్‌ కుమార్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఢిల్లీ మెట్రో పనితీరు, ఇతర వివరాలను రాష్ట్రపతికి వివరించారు. మెట్రో ప్రయాణం ప్రశాంతంగా సాగిందంటూ మెట్రో పనితీరును రాష్ట్రపతి అభినందించారు. ప్రపంచంలోని అత్యంత ఆధునిక రవాణా వ్యవస్థల్లో ఢిల్లీ మెట్రో ఒకటి అని ఆమె కొనియాడారు.

Also Read : AP Budget 2024: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన

Leave A Reply

Your Email Id will not be published!