Rahul Gandhi Sonia Gandhi : తల్లిని కలుసుకున్న తనయుడు
సోనియా..రాహుల్ ఫోటో వైరల్
Rahul Gandhi Sonia Gandhi : రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ 6 నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాలలో యాత్రను పూర్తి చేశారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ , మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్, హర్యానా లో పూర్తయింది.
శనివారం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా చాలా కాలం తర్వాత రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీని(Rahul Gandhi Sonia Gandhi) కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఆయన తన తల్లిని ఆలింగనం చేసుకున్నారు.
దేశానికి రాజు అయినా తల్లికి కొడుకేనని మరోసారి నిరూపించారు రాహుల్ గాంధీ. ఆయన ఇన్నేళ్లయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం కేంద్రంలో కొలువు తీరిన ప్రధాన మంత్రి మోదీని, భారతీయ జనతా పార్టీని, దాని అనుబంధ సంస్థలను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒక రకంగా ఏకి పారేస్తున్నారు.
దేశంలో ద్వేషాన్ని బీజేపీ ప్రమోట్ చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు. అందుకే తాను ప్రేమ అనే దుకాణం తెరిచానని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఇవాళ హస్తినకు చేరుకున్న పాదయాత్రకు భారీ ఎత్తున స్పందన లభించింది. ఈ యాత్రలో సోనియా గాంధీతో పాటు సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఫోటోలను షేర్ చేశారు ట్విట్టర్ లో . దీనికి క్యాప్షన్ కూడా జత చేశారు. అదేమిటంటే తన తల్లి నుండి అందుకున్న ప్రేమను పంచుకుంటున్నానని అని పేర్కొన్నారు.
Also Read : భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదు