Railway Minister: త్వరలో 200 కొత్త రైళ్లు ! వీడియో షేర్ చేసిన రైల్వేమంత్రి !
త్వరలో 200 కొత్త రైళ్లు ! వీడియో షేర్ చేసిన రైల్వేమంత్రి !
Railway Minister : రైలు ప్రయాణికులకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తీపి కబురు చెప్పారు. త్వరలో కొత్తగా 200 రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే మంత్రిత్వశాఖ రంగం సిద్ధం చేసిందని ఆయన ప్రకటించారు. ‘ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా 50 నమో భారత్ రైళ్లు, 100 మెమూ (MEMU) రైళ్లు, 50 అమృత్ భారత్ రైళ్లు’ అంటూ కేంద్ర రైల్వే మంత్రి (Railway Minister) అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ రైళ్ల వీడియోను ఆయన షేర్ చేశారు. అయితే, ఈ రైళ్లు ఎప్పుడు పట్టాలెక్కబోతున్నాయి? ఏయే స్టేషన్లు/డివిజన్లలో అందుబాటులోకి వస్తాయనే వివరాలను మాత్రం పేర్కొనలేదు.
Railway Minister Said Good News
మరోవైపు, హరియాణాలోని మనేసర్ లో దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ను అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రయాణికుల సేవల్ని అప్గ్రేడ్ చేసేందుకు ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మెమూ రైళ్లను 8-12 కోచ్ల నుంచి 16-20 కోచ్లకు పెంచుతున్నామన్నారు. తద్వారా తక్కువ దూరం ప్రయాణికులకు లబ్ది చేకూరుతుందన్నారు. 100కి పైగా MEMU రైళ్ల తయారీ కోసం కాజీపేటలో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, కొత్తగా 50 నమో భారత్ రైళ్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రయాణికులతో పాటు సరకు రవాణాలో రైల్వే శాఖ కృషిని ప్రశంసించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలు దాదాపు 720కోట్ల మంది ప్రయాణికులను, 1617 మిలియన్ టన్నుల సరకును రవాణా చేసిటన్లు తెలిపారు.
Also Read : Air India: ఒక్కరోజే ఆరు ఎయిరిండియా అంతర్జాతీయ సర్వీసులు రద్దు