Rangamarthanda : ఉగాదికి రానున్న రంగ‌మార్తాండ

చిత్రానికి కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వం

Rangamarthanda Release : మైత్రీ మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. క్రియేటివిటీ ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన రంగ‌మార్తాండ చిత్రం తెలుగు వారి పండుగ ఉగాది రోజు విడుద‌ల కానుంది. ఈ విష‌యంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. మార్చి 22న రంగ‌మార్తాండ (Rangamarthanda Release) రిలీజ్ కానుంది. తెలుగు సినిమా రంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర క‌లిగి ఉన్నారు కృష్ణ వంశీ. ఆయ‌న తీసిన సినిమాలు ఇప్ప‌టికీ తెలుగు వారిని విస్మ‌యానికి గురి చేస్తూ వ‌స్తున్నాయి.

క‌మ‌ర్షియ‌ల్ కాకుండా కేవ‌లం కంటెంట్ మీద‌నే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టే ద‌ర్శ‌కుల్లో కృష్ణ‌వంశీ ఒక‌రు. త‌న కెరీర్ లో చాలా గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న సినిమా రంగ‌మార్తాండ‌. అంత‌కు ముందు 2017లో నక్ష‌త్రం తీశారు. అది స‌రిగా ఆడ‌లేదు. 6 సంవ‌త్స‌రాల త‌ర్వాత తిరిగి ఈ కొత్త చిత్రంతో ఉగాది ముందుకు రాబోతున్నారు కృష్ణ‌వంశీ. మ‌హారాష్ట్ర లో బిగ్ హిట్ సాధించింది న‌ట సామ్రాట్ చిత్రం. దీనిని తెలుగులో ద‌ర్శ‌కుడు రంగ‌మార్తాండగా తీశాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది.

కుటుంబం, భావోద్వేగాల‌ను తెర‌కెక్కించారు కృష్ణ‌వంశీ. రంగ‌మార్తాండ‌లో బ్ర‌హ్మానందం, ప్ర‌కాష్ రాజ్ , ర‌మ్య కృష్ణ‌, అన‌సూయ‌, రాహుల్ సిప్లిగంజ్ , శివాత్మిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన ట్రైల‌ర్ , పాట‌ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

రంగ‌మార్తాండ సినిమాలో భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు ప్ర‌కాశ్ రాజ్ , బ్ర‌హ్మానందం. దివంగ‌త గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట‌లు రాశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా చిత్రానికి సంగీతం అందించారు.

Also Read : ఎన్టీఆర్ కు గ్రాండ్ వెల్ క‌మ్

Leave A Reply

Your Email Id will not be published!