Mehul Choksi : మెహుల్ చోక్సీకి రెడ్ నోటీసు

జారీ చేసిన ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ

Mehul Choksi : మెహుల్ చోక్సీకి వ్య‌తిరేకంగా రెడ్ నోటీసు జారీ చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ. ఇప్పుడు ఏ దేశానికైనా స్వేచ్చ‌గా ప్ర‌యాణించ గ‌లుగుతాడు. ఇదిలా ఉండ‌గా మెహుల్ చోక్సీ(Mehul Choksi) 2018లో ఆంటిగ్వాకు పారి పోయాడు.

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ను రూ. 20,000 కోట్ల‌కు పైగా మోసం చేశాడు. అక్క‌డి నుంచి చెక్కేశాడు. వ‌జ్రాల వ్యాపారిగా గుర్తింపు పొందాడు. మెహుల్ చోక్సీకి వ్య‌తిరేకంగా ఇంట‌ర్ పోల్ రెడ్ నోటీసును ఉప‌సంహ‌రించు కోవ‌డం, అత‌ను ఏ దేశానికైనా స్వేచ్ఛ‌గా వెళ్లేందుకు వీలు క‌ల్పిస్తుంది.

దీని వ‌ల్ల భార‌త్ కు అప్ప‌గించే ప్ర‌క్రియ‌ను గుర్తించ‌డం , త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను ప్రారంభించ‌డం క‌ష్టం. ఆ దేశం నుండి లియోన్ ప్ర‌ధాన కార్యాల‌య ఏజెన్సీ ద్వారా జారీ చేసిన రెడ్ నోటీసు భార‌త దేశానికి పారి పోయిన వ్యక్తిని గురించి. అప్ప‌గించే ప్రక్రియ‌ను ప్రారంభించేలా చేస్తుంది. ఇంట‌ర్ పోల్ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ అధికారికంగా అప్పీలు దాఖ‌లు చేస్తుంద‌ని ఏజెన్సీ వ‌ర్గాలు తెలిపాయి .

రెడ్ నోటీసు ఉప‌సంహ‌ర‌ణ‌కు ఆధార‌మైన కిడ్నాప్ కేసులో ఆంటిగ్వాన్ కోర్టు ఆదేశాల‌ను విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు కూడా స‌వాలు చేస్తాయ‌ని పేర్కొన్నారు. రెడ్ నోటీసును ఉప‌సంహ‌రించు కోవ‌డం కంటే 2022లో మెహుల్ చోక్సీని(Mehul Choksi) అప‌హ‌రించే కుట్ర భార‌త ప్ర‌భుత్వ ఆదేశానుసారం జ‌రిగింద‌నే వాద‌న‌ను అంగీక‌రించింది. ఇంట‌ర్ పోల్ ఆర్డ‌ర్ ప్ర‌భుత్వానికి పెద్ద ఇబ్బందిని క‌లిగించింది.

Also Read : రాహుల్ మీర్ జాఫ‌ర్ – సంబిత్

Leave A Reply

Your Email Id will not be published!