Revanth Reddy KCR : ద‌మ్ముంటే అసెంబ్లీ ర‌ద్దు చేయ్ – రేవంత్

ఎన్నిక‌లు ఎప్పుడు పెట్టినా ప‌వ‌ర్ మాదే

Revanth Reddy KCR : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచల‌న కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ కు స‌వాల్ విసిరారు. నువ్వు డేట్ ఫిక్స్ చేయ్. మేం ఎన్నిక‌లు ఎప్పుడు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ద‌మ‌న్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy KCR) మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ నీకు ద‌మ్ముంటే, ఖ‌లేజా ఉంటే వెంట‌నే ర‌ద్దు చేసి రంగంలోకి దిగు అని అన్నారు. ఇప్పుడే కాదు రేపే ఎన్నిక‌లు స్టార్ట్ అంటే గెలిచేది మాత్రం నువ్వు కాదు మేమే గెలవ‌డం ఖాయ‌మ‌న్నారు.

90 ల‌క్ష‌ల ఓట్లు మాకున్నాయి. నువ్వు ఎన్ని ప్ర‌లోభాల‌కు గురి చేసినా, ఎన్ని మాయ మాట‌లు చేసినా, ప్ర‌జ‌ల చెవ్వుల్లో పూలు పెట్టినా అంతిమంగా అధికారంలోకి వ‌చ్చేది తామేన‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.

మోదీ, కేసీఆర్ ఇద్ద‌రూ తోడు దొంగ‌లు. ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన నాటి నుంచి నేటి దాకా ఇద్ద‌రూ క‌లిసే ఉన్నార‌ని, పంపకాల్లో తేడాలు వ‌చ్చినందుకే ఇప్పుడు కొత్త రాగం అందుకున్నార‌ని ఎద్దేవా చేశారు.

పీకే స‌ర్వేలో క‌నీసం 20 సీట్లు కూడా వ‌చ్చేది క‌ష్ట‌మేన‌ని తేల‌డంతో కొత్త నాట‌కానికి తెర లేపారంటూ ధ్వ‌జ‌మెత్తారు. అందుకే బీజేపీపై తానేదో యుద్దం చేస్తున్న‌ట్లు బిల్డ‌ప్ ఇస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

నువ్వు మ‌గోడివే అయితే వెంటనే అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ ఇద్ద‌రూ తోడు దొంగ‌లంటూ మండిప‌డ్డారు.

రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో వ‌రంగ‌ల్ రైతు డిక్ల‌రేష‌న్ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా రాష్ట్రంలో పుంజుకుంద‌న్నారు. పీకే స‌ర్వేలో కాంగ్రస్ కు 25 సీట్ల‌కు మించి రావ‌న్నారు. మాకు టీఆర్ఎస్ కు కేవ‌లం 5 శాతం మాత్ర‌మ తేడా ఉంద‌న్నారు రేవంత్ రెడ్డి.

Also Read : కేసీఆర్ పై పోటీకి సిద్ధం ఓట‌మి ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!