Smart City Project: స్మార్ట్ సిటీ పేరుతో బిజారిణియా సోదరుల రూ.2,700 కోట్ల మోసం

స్మార్ట్ సిటీ పేరుతో బిజారిణియా సోదరుల రూ.2,700 కోట్ల మోసం

Smart City Project : ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.2,676 కోట్ల మేర స్కామ్ చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా దాదాపు 70,000 మందిని బాధితులను చేసారు. సుభాష్ బిజారిణియా, రణవీర్ బిజారిణియా అనే ఇద్దరు సోదరులు గుజరాత్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రతిష్టాత్మక ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ (Smart City Project) పేరుతో అనేక మంది నుంచి రూ.2,676 కోట్ల మేర నిధులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇది గృహ నిర్మాణం పేరుతో నిర్వహించబడిన మోసంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Smart City Project Viral

రాజస్థాన్‌ (Rajasthan) రాష్ట్రం సికార్ జిల్లాకు చెందిన సుభాష్ బిజరణి,రణవీర్ బిజరణిలు అన్నదమ్ములు. వారిలో సుభాష్ బిజారిణియా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. అతను 2014లో ధోలా సిటీలో అతను భూమి కొనుగోలు చేశారు. తరువాత, ఆయన సోదరుడు రణవీర్ బిజారిణియా కూడా అదే ప్రాంతంలో భూమి కొన్నారు. 2021లో ఈ ఇద్దరు కలిసి ‘Nexa Evergreen’ అనే కంపెనీని అహ్మదాబాద్‌లో నమోదు చేసుకున్నారు. ఈ కంపెనీ ధోలా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉందని, దాన్ని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఆ క్రమంలో పెట్టుబడిదారులకు, భూములు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ల్యాప్‌టాప్‌లు, బైక్‌లు, కార్ల వంటి రివార్డులు, కమీషన్లు వస్తాయని వారిద్దరూ పేర్కొన్నారు. పెట్టుబడిదారులను మరింత ప్రోత్సహించడానికి ప్రత్యేక ఐడీల ద్వారా రిఫరల్ స్కీమ్‌ లను కూడా అమలు చేశారు. ఈ మోసంలో సలీమ్ ఖాన్, సమీర్, దతార్ సింగ్, రక్షపాల్, ఓంపాల్, సంవర్మాల్ వంటి వ్యక్తులూ కీలకపాత్ర పోషించారు. వీరు రాజస్థాన్‌లో వేలాది మంది ఏజెంట్లను నియమించి రూ.1,500 కోట్ల వరకూ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా వారు సేకరించిన నిధులతో 1,300 బిగ్హా భూమి, గోవాలో 25 రిసార్టులు, రాజస్థాన్‌ లో గ్రానైట్, మార్బుల్ మైన్లు, జైపూర్‌ లో హోటల్, అహ్మదాబాద్‌ లో ఫ్లాట్లు, ఆడీ, బీఎం‌డబ్ల్యూ వంటి విలాసవంతమైన కార్లను కొనుగోలు చేశారు. మిగతా నిధులను 27 షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. చివరికి కంపెనీ బోర్డు తిప్పేసి పరారయ్యారు. కంపెనీ కార్యాలయాలు మూసివేయడంతో పెట్టుబడి దారుల్లో ఆందోళన మొదలైంది. రోజులు గడుస్తున్నా నిందితుల జాడ తెలియలేదు. తాము మోసపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న జోధ్‌పూర్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన రాజస్థాన్ పోలీసుల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 24 చోట్ల దాడులు నిర్వహించి, రూ.2.03 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. 10 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది. కంపెనీ డైరెక్టర్లు సుభాష్, రణవీర్ బిజారిణియాలను అరెస్టు చేశారు. రాజస్థాన్ పోలీసులు, ED అధికారులు ఈ మోసంలో నష్టపోయిన పెట్టుబడిదారులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. BUDS యాక్ట్ 2019 ప్రకారం, కంపెనీ ఆస్తులను సీజ్ చేసి పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

ధొలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్టు

ధొలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌ కేంద్రం, గుజరాత్ (Gujarat) ప్రభుత్వం కలసి నిర్మిస్తున్నాయి. దేశంలోని మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ. ఢిల్లీ కంటే రెండింతలు పెద్దది. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, అనేక విదేశీ కంపెనీల కార్యాలయాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 2042 నాటికి వినియోగంలోకి రానుంది. నిజమైన ధొలేరా ప్రాజెక్టును అడ్డుగా పెట్టుకొని వేల మందిని మోసం చేసిన ఈ స్కామ్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక ముందుగా ఇలాంటి స్కామ్స్‌కు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read : Wife: ఆస్తి ప్రియురాలికి కట్టబెట్టడంతో భర్తపై పెట్రోలు పోసిన చంపిన భార్య

Leave A Reply

Your Email Id will not be published!