Saamana Kasba By Poll : బీజేపీ కంచుకోట‌లో ఎంవీఏ పాగా

సామ్నా సంపాద‌కీయంలో కామెంట్స్

Saamana Kasba By Poll : శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీకి చెందిన సామ్నా ప‌త్రిక సంపాద‌కీయంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ధానంగా మ‌హారాష్ట్ర లోని కస్బా పేత్ నియోజ‌క‌వ‌ర్గం భార‌తీయ జ‌న‌తా పార్టీకి కంచుకోట‌గా ఉంది. మ‌హా వికాస్ అఘాడీకి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేశారు. దీంతో బీజేపీ కంచుకోట క‌దిలిందంటూ సంపాదకీయం పేర్కొంది. రాబోయే రోజుల్లో ఎంవీఏకు మంచి రోజుల‌ని తెలిపింది. ఒక ర‌కంగా బీజేపీకి ఉద్ద‌వ్ ఠీం దిగ్భ్రాంతికి గురి చేసింద‌ని స్ప‌ష్టం చేసింది.

అకార‌ణంగా ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టినందుకు ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బీజేపీకి స‌మాధానం చెప్పార‌ని కొనియాడింది. ఈ ఫ‌లితం ప్ర‌స్తుత షిండే, బీజేపీ స‌ర్కార్ ప‌ట్ల ఎంత అసంతృప్తితో ఉన్నార‌నేది తేలి పోయింద‌ని మండిప‌డింది. శివ‌సేన మౌత్ పీస్ సామ్నా(Saamana Kasba By Poll) నిప్పులు చెరిగింది. క‌స్బా పేత్ ఫ‌లితం మ‌హారాష్ట్ర‌తో పాటు భార‌త దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తితో ఉంద‌ని చూపుతోంది.

జ‌రుగుతున్న‌ది ఏమిటో ప్ర‌జ‌ల‌కు తెలుసు. అందుకే వాళ్లు త‌మ విలువైన ఓటును ఎంవీఏ ఉమ్మ‌డి అభ్య‌ర్థి వైపు మొగ్గు చూపార‌ని సామ్నా అభిప్రాయ ప‌డింది. క‌స్బా పేత్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితం పుణె అంత‌టా జ‌రుపుకుంటున్నారు. ఈ వేడుక 2024 వ‌ర‌కు మ‌రాఠా లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఎంవీఏ మ‌ద్ద‌తుతో బ‌రిలోకి దిగిన కాంగ్రెస్ అభ్య‌ర్థి ర‌వీంద్ర ధంగేక‌ర్ 10,915 ఓట్ల‌తో బీజేపీ అభ్య‌ర్థి హేమంత్ ర‌సానేపై ఘ‌న విజ‌యం సాధించారు.

Also Read : బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ. 6 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!