Sajjala Bhargav Reddy: మంగళగిరి పోలీసు స్టేషన్ లో సజ్జల భార్గవ్ రెడ్డి

మంగళగిరి పోలీసు స్టేషన్ లో సజ్జల భార్గవ్ రెడ్డి

Sajjala Bhargav Reddy : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి సజ్జల భార్గవ్ రెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డి అనుకున్న సమయానికంటే ముందుగానే పోలీసుల విచారణకు హాజరయ్యారు. బుధవారం మంగళగిరి పోలీస్‌స్టేషన్‌ లో సజ్జల విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో భార్గవ్ రెడ్డిని(Sajjala Bhargav Reddy) పోలీసులు ప్రశ్నించారు.

Sajjala Bhargav Reddy Attended

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు జనసేన, టీడీపీ ముఖ్య నేతలపై కూడా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే ఫిర్యాదు మేరకు సజ్జల భార్గవ్ రెడ్డిపై ఇప్పటికే మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు నమోదు మేరకు సజ్జలకు మంగళగిరి రూరల్ పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు రాకుండా సజ్జల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా సుప్రీంలో పిటిషన్ వేశారు. అయితే సజ్జల వేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. దీనితో పోలీసులు మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాల్సిందిగా మంగళగిరి రూరల్‌ పోలీసులు సజ్జల భార్గవ్‌ కు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న సజ్జల ముందుగానే మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో సజ్జలను మంగళగిరి పోలీసులు విచారించారు.

Also Read : CM Revanth Reddy: నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న పార్టీ బీఆర్ఎస్ – సీఎం రేవంత్‌రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!