Sajjala Ramakrishna Reddy : అంప‌శ‌య్య‌పై తెలుగుదేశం

స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి ఫైర్

Sajjala Ramakrishna Reddy : ఏం సాధించార‌ని సంబురాలు జ‌రుపుకుంటున్నారంటూ తెలుగుదేశం పార్టీపై ఫైర్ అయ్యారు వైఎస్సార్ సీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy). ఎన్టీఆర్ టీడీపీ వేరు ఇప్పుడున్న టీడీపీ వేర‌ని ఎద్దేవా చేశారు.

మంగ‌ళ‌వారం తాడేప‌ల్లి గూడెంలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు స‌జ్జ‌ల‌. టీడీపీది 40 ఏళ్ల సంబురం కాద‌ని అది 27 ఏళ్ల సంబుర‌మేనంటూ పేర్కొన్నారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేయ‌డంలోనే కాదు ఎలా మేనేజ్ చేయ‌డంలో కూడా ఆరి తేరిన నాయ‌కుడు చంద్ర‌బాబు అని సెటైర్ విసిరారు. ఆయ‌న‌కు మీడియా మేనేజ్ మెంట్ కూడా బాగా తెలుస‌న్నారు.

ఎన్టీఆర్ ప్ర‌జాభిమానంతో ప‌వ‌ర్ లోకి వ‌చ్చారు. కానీ చంద్ర‌బాబు కుట్ర‌లు, కుతంత్రాలు, వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేస్తూ అధికారంలోకి వ‌చ్చారంటూ ఆరోపించారు. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన నాయ‌కుడు.

ఖూనీ చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుదేన‌ని మండిప‌డ్డారు స‌జ్జ‌ల రామ‌కృష్నా రెడ్డి(Sajjala Ramakrishna Reddy). ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అవ‌సాన ద‌శ‌లో తెలుగుదేశం పార్టీ ఉంద‌న్నారు.

శాస‌న‌స‌భ జ‌ర‌గ‌కుండా టీడీపీ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింద‌ని ఫైర్ అయ్యారు. ఎల్లో మీడియాకు ఉన్న ప‌నంతా టీడీపికి బాకాలు ఊద‌డం త‌ప్ప స‌మాజానికి చేసిందేమీ లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

27 ఏళ్ల టీడీపీ చ‌రిత్ర‌పై ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల‌న్నారు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. కానీ చంద్ర‌బాబును జ‌నం న‌మ్మ‌లేదు. జ‌గ‌న్ ముందు బాబు పాచిక‌లు పార‌లేద‌న్నారు స‌జ్జ‌ల‌.

చంద్ర‌బాబు వ‌దిలేసిన అప్పుల్ని తాము తీర్చాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. త‌మ ప‌రిపాల‌న దేశానికి ఆద‌ర్శంగా మారింద‌న్నారు సజ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి.

Also Read : బుగ్గ‌న ఆస్కార్ కు అర్హుడే

Leave A Reply

Your Email Id will not be published!