Sandeep Sharma Mazic : శ‌ర్మ మ్యాజిక్ ధోనీ..జ‌డేజా షాక్

ఆ ఆఖ‌రు ఓవ‌ర్ లో ఏం జ‌రిగింది

Sandeep Sharma Mazic : యుద్దం ఎలా ఉంటుందో చూడాల‌ని అనుకుంటే , విజ‌యం ఎలా ద‌క్కుతుందో అనుభ‌వం లోకి రావాల‌ని అనుకుంటే ఐపీఎల్ మ్యాచ్ లు చూడాల్సిందే. మొన్న కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ స్టార్ రింకూ సింగ్ దుమ్ము రేపితే నిన్న సునీల్ స‌రైన్ చుక్క‌లు చూపించాడు. ఇక ఇవాళ చెన్నై చెపాక్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో అద్భుత‌మైన బంతుల‌తో మ్యాజిక్ చేశాడు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు చెందిన సీమ‌ర్ సందీప్ శ‌ర్మ‌.

మొద‌ట బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ 8 వికెట్లు కోల్పోయి 175 ర‌న్స్ చేసింది. అనంత‌రం 176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ 3 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ఆఖ‌రి ఓవ‌ర్ లో 21 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది చెన్నైకి. క్రీజులో ఉన్న‌ది ఎవ‌రో కాదు అపార‌మైన అనుభవం క‌లిగిన మ‌హేంద్ర సింగ్ ధోనీ, ర‌వీంద్ర జ‌డేజా.

ధోనీ 17 బంతుల్లో 32 ర‌న్స్ తో మెరిస్తే జ‌డేజా 15 బాల్స్ ఆడి 25 ప‌రుగులు చేశాడు. ఇద్ద‌రూ చివ‌రి దాకా ఉన్నారు కానీ త‌మ జ‌ట్టును గెలిపించ లేక పోయారు. క‌ళ్లు చెదిరే షాట్స్ ఆడినా సందీప్ శ‌ర్మ బౌలింగ్ మ్యాజిక్ కు (Sandeep Sharma Mazic)  బోల్తా ప‌డ్డారు.

సందీప్ శ‌ర్మ తొలి రెండు బంతుల్ని వైడ్ గా వేశాడు. మూడో బంతిని యార్క‌ర్ వేశాడు. నాలుగో బంతిని ధోనీ సిక్స‌ర్ కొట్టాడు. ఐదో బంతికి మ‌ళ్లీ సిక్స‌ర్ బాదాడు జార్ఖండ్ డైన‌మెట్. చివ‌రి మూడు బ‌తుల్లో 7 ప‌రుగులు కావాల్సి వ‌చ్చింది. విచిత్రం ఏమిటంటే త‌ర్వాతి 3 బాల్స్ కు 3 ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చాడు. దీంతో విజ‌యం ఖ‌రారైంది రాజస్థాన్ కు.

Also Read : రాజ‌స్థాన్ సీమ‌ర్ మ్యాచ్ విన్న‌ర్

Leave A Reply

Your Email Id will not be published!