Sharmistha: ఆపరేషన్ సిందూర్పై కామెంట్ చేసిన లా స్టూడెంట్ అరెస్ట్
ఆపరేషన్ సిందూర్పై కామెంట్ చేసిన లా స్టూడెంట్ అరెస్ట్
Sharmistha : పహల్గాం ఉగ్రదాడిలో పసుపు, కుంకుమలు కోల్పోయిన వారికి న్యాయం చేయటం కోసం భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్(Pakistan), పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. భారత ఆర్మీ చేపట్టిన ‘ ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor)పై దేశ ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, కొంతమంది మాత్రం ఆపరేషన్ సిందూర్ పై తమ అభిప్రాయాలను తప్పుగా వ్యక్తం చేస్తున్నారు.
Sharmistha Arrest
దీనిలో భాగంగా పుణెకు చెందిన శర్మిష్ట పనోలి(Sharmistha) అనే లా స్టూడెంట్ కూడా ఆపరేషన్ సిందూర్ గురించి తప్పుగా మాట్లాడింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని రోజుల క్రితం ఓ పోస్టు పెట్టింది. ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. దీనితో తీవ్ర దుమారం చెలరేగింది. నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. తాను తప్పు చేశానని గుర్తించిన శర్మిష్ట వీడియోను వెంటనే డిలీట్ చేసింది. తన ఎక్స్ ఖాతాలో ఓ క్షమాపణ పోస్టు పెట్టింది.
‘నాకు ఎవర్నీ బాధ పెట్టాలన్న ఉద్దేశ్యం లేదు. ఆ వ్యాఖ్యలు కేవలం నా వ్యక్తిగతం మాత్రమే. నా వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి’ అని పేర్కొంది. అయితే, అప్పటికే పరిస్థితి చెయ్యిదాటి పోయింది. ఆపరేషన్ సిందూర్పై ఆమె చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కోల్కతాలోని ఓ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దీనితో కోల్కతా పోలీసులు షర్మిష్టను గురుగ్రామ్ లో అరెస్ట్ చేశారు. శనివారం ఆమెను అలీపోర్ కోర్టులో హాజరుపరిచారు. శర్మిష్ట(Sharmistha) అరెస్ట్పై పోలీసులు మాట్లాడుతూ.. ‘ శర్మిష్టకు, ఆమె కుటుంబానికి చాలా సార్లు నోటీసులు పంపాము. ఎవరూ పట్టించుకోలేదు. తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. శుక్రవారం గురుగ్రాములో ఆమెను అరెస్ట్ చేశాము’ అని తెలిపారు.
పుణెకు చెందిన లా స్టూడెంట్ షర్మిస్తా పనోలి గురుగ్రామ్ లో ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె.. ఆపరేషన్ సిందూర్పై స్పందించింది. ఒక వీడియోను మే 14, 2025న తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేస్తూ అభ్యంకర వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియోపై ఒక పాకిస్తాన్ ఫాలోవర్ స్పందిస్తూ… పహల్గాం ఘటన తర్వాత భారత సైన్యం చర్యలపై ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ… ఆమె ఒక మతంపై తీవ్రంగా స్పందిస్తూ మతాన్ని కించపరిచే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
అనంతరం.. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. రాడికల్ పాకిస్తానీ టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై, పెట్టిన పోస్టులపై అదే సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణలు కోరింది. అప్పటికే ఈ క్లిప్ వైరల్ కావడంతో కోల్కత్తా పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా కోల్కత్తా పోలీసులు షర్మిస్తాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆమెను గురుగ్రాంలో అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్ అన్యాయంగా జరిగిందని, అనైతికమని, ఆమెను తక్షణమే విడుదల చేయాలని కూడా సోషల్ మీడియలో #ReleaseSharmistha హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడం గమనార్హం. ఆమె ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. అయితే, పోలీసులు 19ఏళ్ల యువతిని అరెస్ట్ చేయడానికి 1500 కిలోమీటర్లు ప్రయాణించడంపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read : Covid 19: దేశంలో విజృంభిస్తోన్న కోవిడ్ ! 3 వేలు దాటిన కొవిడ్ కేసులు !