Aditya Thackeray : మ‌రాఠా పోరులో అంతిమ విజయం మాదే

ధీమా వ్య‌క్తం చేసిన ఆదిత్యా ఠాక్రే

Aditya Thackeray : శివ‌సేన పార్టీ యువ నాయ‌కుడు, మంత్రి ఆదిత్యా ఠాక్రే(Aditya Thackeray) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇప్ప‌టికే కీల‌క స‌మావేశం ముగిసింది. ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నాం. మా స్ట్రాట‌జీ ఏంటి అనేది త్వ‌ర‌లోనే తేలుతుంది.

చివ‌ర‌కు స‌త్య‌మే నిలుస్తుంది. ఇది మ‌రాఠా ఆత్మ గౌర‌వానికి ద్రోహుల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న పోరాటం. ఇది ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. అందుకే ప్ర‌జ‌లంతా స్వ‌చ్ఛందంగా త‌ర‌లి వ‌స్తున్నారు.

బాలా సాహెబ్ ఠాక్రే వార‌సుడు శివ‌సేన చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రేకు(Aditya Thackeray) మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని సీఎం త‌న‌యుడు ఆదిత్యా ఠాక్రే అన్నారు. శ‌నివారం పార్టీ స‌మావేశంలో పాల్గొన్న అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఎక్క‌డా లేనంత‌టి ప్ర‌యారిటీ ఇచ్చినా వారు గుర్తించ లేక పోయార‌ని ఆరోపించారు. ఎవ‌రో ఏదో చెబితే వారి అండ చూసుకుని త‌మ ఎదుగుద‌ల‌కు కార‌ణ‌మైన పార్టీని మోసం చేస్తే తాము భ‌రించినా జ‌నం భ‌రించ‌ర‌ని పేర్కొన్నారు.

పార్టీ అనామ‌కుల‌కు టికెట్లు ఇచ్చింది. వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించింది. ద‌గ్గ‌రుండి స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేసింది. అయినా ఎవ‌రో కొంద‌రు కావాల‌ని ఆశ చూపిస్తే ఎలా వెళ‌తార‌ని ప్ర‌శ్నించారు ఆదిత్యా ఠాక్రే.

మ‌రాఠా చ‌రిత్ర‌లో ఇలాంటి స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డం కొత్త కాదు. మాకు మామూలేన‌ని పేర్కొన్నారు. నిజం త్వ‌ర‌లోనే తేలుతుంది.

ఎవ‌రు గెలుస్తార‌నేది ప‌క్క‌న పెడితే ఈ కుట్ర రాజ‌కీయంలో చివ‌ర‌కు ధ‌ర్మమే విజ‌యం సాధిస్తుంద‌ని మాత్రం ఘంటా ప‌థంగా చెప్ప‌గ‌ల‌న‌ని అన్నారు ఆదిత్యా ఠాక్రే. వాళ్లు ఇంకెంత కాలం గౌహ‌తిలో ఉంటార‌ని ప్ర‌శ్నించారు.

Also Read : శివ‌సేనను క‌దిలిస్తే త‌ట్టుకోవ‌డం క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!