Siddaramaiah : కర్ణాటక – విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రంలోని రైతులందరికీ మేలు చేకూర్చేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం సిద్దరామయ్య. త్వరలోనే మీ కష్టాలు తీరనున్నాయని ప్రకటించారు.
Siddaramaiah Good News to Farmers
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తాము కొలువు తీరిన తర్వాత రాష్ట్రంలో గతంలో ఏలిన సర్కార్ పాలనను అస్తవ్యస్తంగా మార్చిందన్నారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
అయితే విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం జరుగుతున్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. ఇదే సమయంలో విద్యుత్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిద్దరామయ్య(Siddaramaiah) చెప్పారు.
ఎంత ఖర్చయినా సరే ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ ను కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు రెండు విడతల్లో 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు సీఎం.
కొందరు కావాలని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం అయ్యాయని ఆరోపించారు.
Also Read : Asaduddin Owaisi : కేసీఆర్ బాహుబలి లాంటోడు