Navjyot Singh Sidhu : భ‌ద్ర‌తా వైఫ‌ల్యం వ‌ల్లే సిద్దూ హ‌త్య

ఆవేద‌న వ్య‌క్తం చేసిన న‌వ‌జ్యోత్ సిద్దూ

Navjyot Singh Sidhu : పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ న‌వ జ్యోత్ సింగ్ సిద్దూ(Navjyot Singh Sidhu) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పంజాబ్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు. భ‌ద్ర‌తా వైఫ‌ల్యం వ‌ల్ల‌నే ప్ర‌ముఖ గాయ‌కుడు, కాంగ్రెస్ నాయ‌కుడు సిద్దూ మూసేవాలా దారుణ హ‌త్య‌కు గుర‌య్యారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వం అనేది ఉందా అని ప్ర‌శ్నించారు.

మ‌ర్డ‌ర్ కేసులో జైలుకు వెళ్లి తిరిగి వ‌చ్చిన సిద్దూ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. సిద్దూ మూసేవాలా ఒక వ్య‌క్తి కాదు శ‌క్తి అని పేర్కొన్నారు. ర‌క్త మాంసాలు ఉన్న మ‌నుషులు వ‌స్తారు పోతారు కానీ సంస్థ‌లు మాత్రం త‌రాల‌కు స్పూర్తిని ఇస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. సిద్దూ మేధా శ‌క్తి శాశ్వ‌త‌మైన‌ద‌ని పేర్కొన్నారు.

ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వెంట‌నే రాష్ట్రంలోని ప‌లువురు ప్ర‌ముఖులు, నాయ‌కుల‌కు భ‌ద్ర‌త తొల‌గించార‌ని అందు వ‌ల్ల‌నే మూసేవాలాపై దాడి జ‌రిగింద‌ని ఆరోపించారు. త‌న‌కు ఉన్న సెక్యూరిటీని ఏ ప్రాతిప‌దిక‌న తొల‌గించాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు న‌వ జ్యోత్ సింగ్ సిద్దూ(Navjyot Singh Sidhu). సిద్దూ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్న సీఎం భ‌గ‌వంత్ మాన్ కు ఎందుకంత భ‌ద్ర‌త ఉంద‌ని నిల‌దీశారు.

Also Read : భ‌గ‌వంత్ మాన్ పై భ‌గ్గుమ‌న్న సిద్దూ

Leave A Reply

Your Email Id will not be published!