Smita Sabharwal: పోలీసుల నోటీసులపై “ఎక్స్” వేదికగా స్పందించిన స్మితా సభర్వాల్‌

పోలీసుల నోటీసులపై "ఎక్స్" వేదికగా స్పందించిన స్మితా సభర్వాల్‌

Smita Sabharwal : తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూములకు సంబంధించి ఏఐ సహాయంతో రూపొందించిన ఫేక్ ఫోటోలను ఆమె తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ లో పోస్ట్ చేసినందుకు… తెలంగాణ పోలీసులు ఆమెకు ఈనెల 12న నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్మాల్‌(Smita Sabharwal) శనివారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ పై స్టేట్ మెంట్ ఇచ్చారు.

అనంతరం ఈ నోటీసులపై ఆమె తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చా. పోలీసులకు పూర్తిగా సహకరించా. నేను ఎలాంటి పోస్ట్‌ చేయలేదు. హాయ్‌ హైదరాబాద్‌ పోస్టును రీట్వీట్‌ చేశా. 2 వేల మంది అదే పోస్ట్‌ ను షేర్‌ చేశారు. వాళ్లందరితోనూ ఇలాగే వ్యవహరిస్తారా?. ఇలాగే నోటీసులు ఇచ్చి వారందరిపై ఇలాగే చర్యలు తీసుకుంటారా?. అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్‌ చేసినట్లు అవుతుంది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. ఇది ఎంత వరకు కరెక్ట్‌?. జస్టిస్‌ అనేది అందరికీ సమానంగా ఉండాలి. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్‌ చేస్తున్నారా?’’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Smita Sabharwal – స్మితా సబర్వాల్‌ పోస్ట్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం సీపీఆర్వో

కంచ గచ్చిబౌలి ఘటనలో స్మితా సబర్వాల్(Smita Sabharwal) చేసిన ట్వీట్‌ పై సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్ చేశారు. ‘‘ఆ ఐఏఎస్‌ అధికారి “దృష్టికోణం”లో మార్పు ఎందుకొచ్చినట్టు?. అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ‘‘అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (సీఎంవోలో ఇరిగేషన్‌ బాధ్యతలు నిర్వహించిన) వీరే… అప్పుడు కనిపించని తప్పు… ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో?… అసలు ఏడుపు వన్య ప్రాణుల కోసమా? అధికారం కోల్పోయిన వారి కోసమా?’ అంటూ సీపీఆర్వో ట్వీట్‌ చేశారు.

కాగా, కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి పెద్దఎత్తున వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. 400 ఎకరాల భూముల్లో చెట్లు తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించగా… హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రక్తతలు చోటుచేసుకున్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా దీనిపై పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. చెట్లు తొలగింపునకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ… కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఏఐ ఫొటోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు అలాంటి వారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఫేక్ ఫొటోలు రీపోస్టు చేశారంటూ పోలీసులు ఆమెకు నోటీసులు అందించారు.

Also Read : NIMS: నిమ్స్‌ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో అగ్ని ప్రమాదం

Leave A Reply

Your Email Id will not be published!