Speaker Appavu: సీఎం స్టాలిన్‌ పై స్పీకర్ అప్పావు ఆశక్తికరమైన వ్యాఖ్యలు

సీఎం స్టాలిన్‌ పై స్పీకర్ అప్పావు ఆశక్తికరమైన వ్యాఖ్యలు

Speaker Appavu : తమిళనాడు సీఎం ఎంకే స్టానిల్ పై…. ఆ రాష్ట్రం శాసనసభ స్పీకర్ అప్పావు(Speaker Appavu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ కు నటించడమంటే ఇష్టంలేదని… ప్రజల అవసరాలను తీర్చడమే ఆయన అభిమతమని ఆయన అన్నారు. తిరునల్వేలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనే అంశంపై సోమవారం జరిగిన సదస్సుకు సంబంధించి రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేశారని, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఏమాత్రం నటన ప్రదర్శించలేదన్నారు. దేవాదాయశాఖ అధ్వర్యంలో కళాశాలలు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా కొంతమంది న్యాయస్థానానికి వెళ్ళి స్టే తీసుకున్నారని తెలిపారు. అందరూ సమానులేనన్న సంకల్పంతో డీఎంకే ప్రభుత్వం పరిపాలిస్తోందని, ఏమైన కొరతలున్నట్లు చూపిస్తే వెంటనే పరిష్కరింపజేస్తోందన్నారు.

అసెంబ్లీ కార్యక్రమాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కొన్ని విధివిధాలున్నాయని స్పీకర్‌(Speaker Appavu) గా తాను వాటినే పాటిస్తున్నానని, అయినప్పటికీ ప్రతిపక్షం కోరిక మేరకు ఈ వ్యవహారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శాసన సభ్యులు అసెంబ్లీలో ఎలాంటి అంశాల గురించి మాట్లాడాలన్నపై శిక్షణ ఇప్పిస్తున్నామని, దశలవారీగా ప్రత్యక్షప్రసారం చేసే పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.

రాష్ట్ర అసెంబ్లీని ప్రారంభించి 104ఏళ్ళు పూర్తవుతున్నాయని, 1952వ సంవత్సరం తర్వాత అసెంబ్లీలో వివిధ పార్టీల నాయకులు మాట్లాడిన ప్రసంగ పాఠాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నట్లు తెలిపారు. 1921 నుండి 1952 వరకు అసెంబ్లీ తీసుకున్న చర్యలు, రాతప్రతులకు సంబంధించిన పరిశోధన ముమ్మరంగా జరుగుతున్నాయని, తర్వాత జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ పనులన్నింటిని పూర్తిచేయనున్నట్లు స్పీకర్‌ అప్పావు(Speaker Appavu) తెలిపారు.

Speaker Appavu – డీఎంకే పార్టీపై టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ ధ్వజం

తమిళనాడులో ప్రజాస్వామ్య పాలన లేదని, దురహంకారంతో కూడిన ఫాసిస్ట్‌ పాలన సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వంపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వ్యాఖ్యానిస్తూ… ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసు శాఖ అధికార పార్టీకి కీలుబొమ్మగా మారి, అమాయక ప్రజలపె బలప్రయోగం చేస్తూ, ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొడుతోందని విజయ్‌ దుయ్యబట్టారు.

స్థానిక వ్యాసర్పాడి ముల్లైనగర్‌ ప్రాంతంలో సోమవారం సంభవించిన అగ్నిప్రమాదంలో గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయన్నారు. సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధిత కుటుంబాలను సమీపంలోని పాఠశాలలో ఉంచారని, వారికి టీవీకే కార్యకర్తలు మానవతా దృక్పథంతో బట్టలు, దుప్పట్లు, చాపలు, అత్యవసర సామగ్రి అందించారన్నారు. కానీ, పోలీసులు జోక్యం చేసుకుని, టీవీకే కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారన్నారు.

ఇదేమని ప్రశ్నించిన పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి గంగావతిపై పోలీసులు దాడిచేయడమేంటని ప్రశ్నించారు. బాధితులను ఆదుకొనేందుకు ముందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోవడమేంటి? పోలీసుల చర్యలను సీఎం సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు పునరావృత్తమైతే టీవీకే తరఫున ప్రజలను సమీకరించి పోరాటాలు చేస్తామని విజయ్‌ హెచ్చరించారు.

Also Read : Abhishek Banerjee : పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎండగట్టిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ

Leave A Reply

Your Email Id will not be published!