Spelling Bee: అమెరికా ‘స్పెల్లింగ్ బీ’ విజేతగా హైదరాబాదీ సంతతి బాలుడు
అమెరికా ‘స్పెల్లింగ్ బీ’ విజేతగా హైదరాబాదీ సంతతి బాలుడు
Spelling Bee : అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘జాతీయ స్పెల్లింగ్ బీ(Spelling Bee)’ పోటీల్లో భారత సంతతికి చెందిన విద్యార్ధి సత్తా చాటాడు. ఈ పోటీల్లో హైదరాబాద్ మూలాలున్న బాలుడు అగ్రస్థానంలో నిలిచాడు. టెక్సాస్లో ఉంటున్న 13 ఏళ్ల ఫైజాన్ జాకీ 21వ రౌండ్లో స్క్రిప్స్ నిర్వాహకులు అడిగిన ‘ఎక్లైర్సిస్మెంట్’ అనే ఫ్రెంచి పదం స్పెల్లింగ్ను సరిగా చెప్పి విజేతగా నిలిచాడు. కాలిఫోర్నియాకు చెందిన మరో భారత సంతతి బాలుడు సర్వజ్ఞ కదమ్పై జాకీ పైచేయి సాధించాడు. ఇప్పటివరకు 4 సార్లు స్పెల్లింగ్బీ(Spelling Bee) పోటీల్లో పాల్గొన్న జాకీ, గతేడాది రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. తాజా పోటీలో విజేతగా నిలవడం వల్ల 50,000 డాలర్ల నగదు, ట్రోఫీ సహా మెరియమ్ వెబ్స్టర్ నుంచి 2,500 డాలర్ల బహుమతిని జాకీ అందుకున్నాడు.
తన విజయాన్ని తల్లిదండ్రులతోపాటు హైదరాబాద్ లో ఉండే తాతయ్య, నానమ్మలకు అంకితం చేస్తానని జాకీ తెలిపాడు. 1925లో స్పెల్లింగ్-బీ పోటీలను ప్రారంభించగా, 100వ పోటీలో ఫైజాన్ జాకీ ఛాంపియన్గా నిలిచాడు. గతేడాది నల్గొండ మూలాలున్న 12 ఏళ్ల బృహత్సోనా గెలుపొందాడు.
Spelling Bee – కుమార్తెను అమెరికా నుంచి రప్పించాలని తండ్రి వేడుకోలు
భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక, అమెరికాలో చిక్కుకున్న తన కుమార్తెను కాపాడాలని ఓ తండ్రి వేడుకుంటున్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు గులాం అఫ్జల్, న్యాయవాది విజయ్కుమార్ మాట్లాడుతూ… తన కూతురు ఫాతిమా హస్నాకు 2007లో గుల్బర్గాకు చెందిన డబీరుద్దీన్ అనే డాక్టర్తో వివాహం జరిగిందన్నారు. వివాహం అయిన తరువాత అమెరికాకు వెళ్లిపోయి అక్కడ 58 రోజులపాటు బాగానే ఉన్నారని తెలిపారు. తరువాత డబీరుద్దీన్ కేవలం అమెరికా వెళ్లేందుకే ఫాతిమాను వివాహం చేసుకున్నట్లు తెలియడంతో ఇద్దరి మధ్య తగాదాలు జరిగాయని తెలిపారు. దీనితో వెంటనే ఆమె భారతదేశానికి వచ్చి అతనిపై కేసులు వేసి చట్టపరంగా విడాకులు తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగ నిమిత్తం తిరిగి అమెరికాకు వెల్లిన ఫాతిమాను డబీరుద్దీన్ వేధింపులకు గురిచెయ్యడమే కాకుండా ఆమెపైనే తనను మోసం చేసి అమెరికాకు తీసుకువచ్చిందిని అమెరికాలో తప్పుడు కేసులు పెట్టాడని తెలిపారు.
దీనితో అమెరికా చట్టం ప్రకారం ఆమెపై కేసు నమోదు చేసి డబీరుద్దీన్ కే భరణం ఇవ్వాలని చెప్పడంతో గత 10 సంవత్సరాల నుంచి ఫాతిమా ఉద్యోగం చేసుకుంటూ భరణం ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెపై కేసులు ఉండటంతో ఇండియాకు రాలేని పరిస్థితి ఉందని అటు భరణం ఇవ్వలేక తన పింఛన్ డబ్బులు కూడా పంపించాల్సి వస్తుందని గులాం అఫ్జల్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తన కుమార్తెను భారత్కు రప్పించాలని, అలానే డబీరుద్దీన్పై కూడా ఇక్కడ తన కూతురు పెట్టిన కేసులు ఉన్నందున అతన్ని కూడా ఇండియాకు రప్పించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : Bayya Sanny Yadav: నా కుమారుడికి పాకిస్థాన్తో సంబంధాల్లేవు – సన్నీయాదవ్ తండ్రి