Ram Gopal Varma Viswanath : ఇంకా న‌మ్మ‌లేక పోతున్నా- ఆర్జీవీ

కె.విశ్వ‌నాథ్ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడు

Ram Gopal Varma Viswanath : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ మృతి చెంద‌డంపై తీవ్రంగా స్పందించారు. ఆయ‌న ఇవాళ భౌతికంగా లేరు అన్న విష‌యం ఇంకా న‌మ్మ‌లేక పోతున్నాన‌ని పేర్కొన్నారు. భార‌త దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడు కె. విశ్వ‌నాథ్ అని పేర్కొన్నారు. ఆయ‌న మ‌ర‌ణించార‌న్న వార్త వినేందుకు చాలా బాధ‌గా ఉంద‌న్నారు ఆర్జీవీ(Ram Gopal Varma) . ఆయ‌న వెళ్లి పోయారు. కానీ క‌ళాత‌ప‌స్వి చేసిన సినిమాలు ఎప్ప‌టికీ జీవించి ఉంటాయ‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా క‌ళాప‌తస్వికి ఎన్నో అవార్డులు , పుర‌స్కారాలు వ‌రించాయి. 2017లో దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయ‌న‌న‌ను ఘ‌నంగా స‌త్క‌రించింది. 1992లో ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కింది.

కె. విశ్వనాథ్ స్వ‌స్థ‌లం ఆంధ్ర ప్ర‌దేశ్ లోని గుంటూరు జిల్లా రేప‌ల్లె. ఆయ‌న వ‌య‌స్సు 92 ఏళ్లు. త‌న జీవితాన్ని సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించారు. కొంత కాలం స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశారు. 1961లో ఆత్మ గౌర‌వం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆయ‌న కుల వ్య‌వ‌స్థ‌, వైక‌ల్యం, అంట‌రానిత‌నం, లింగ వివ‌క్ష‌, వ‌ర‌క‌ట్నం, సామాజిక ఆర్థిక స‌వాళ్లు వంటి ఇతివృత్తాల‌తో 50 కి పైగా తెలుగు, హిందీ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

చెల్లెలి కాపురం, కాలం మారింది, శార‌ద‌, ఓ సీత క‌థ‌, జీవ‌న జ్యోతి , సిరి సిరి మువ్వ‌, శంక‌రా భ‌ర‌ణం, స‌ప్త‌ప‌ది, సాగ‌ర సంగ‌మం, స్వాతి ముత్యం, శృతి ల‌య‌లు, స్వ‌ర్ణ క‌మ‌లం, సూత్ర ధారులు, ఆప‌ద్భాంధ‌వుడు, స్వాతి కిర‌ణం చిత్రాలు ఎన్న‌ద‌గిన‌వి. హిందీలో కామ్ చోర్ , శుభ్ కామ్నా, ఈశ్వ‌ర్ , ధ‌న్వాన్ తీశారు.

Also Read : మాట‌లు రావ‌డం లేదు – రాధిక‌

Leave A Reply

Your Email Id will not be published!