Supreme Court: రేప్‌ కేసులో యువకుడికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌

రేప్‌ కేసులో యువకుడికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌

Supreme Court : అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 ఏళ్ల సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేమంటూ ఆ అత్యాచారం కేసుపై ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అత్యాచారానికి గురైనట్లు చెబుతున్న 40 ఏళ్ల మహిళ చిన్నపిల్ల కాదని పేర్కొంది. ‘ఆమె చిన్న పిల్ల కాదు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేరు’ అని పేర్కొంది. ‘ఆ యువకుడితో వివిధ ప్రదేశాలకు వివాహిత స్వచ్ఛందంగానే వెళ్లింది. ఆమె అంగీకారంతోనే లైంగిక చర్య జరిగిట్లు పరోక్షంగా వెల్లడించింది. అతడిని అరెస్టు చేసి, జైల్లో పెట్టి తొమ్మిది నెలలు గడుస్తున్నా పోలీసులు అభియోగాలు నమోదు చేయలేదని, అందుకే మధ్యంతర బెయిల్‌ ఇస్తున్నట్లు పేర్కొంది.

Supreme Court Grants Bail to

ఆ మహిళ ఆ యువకుడిని ఇష్టపూర్వకంగానే కలిస్తే అతడిపై రేప్‌ కేసు ఎలా నమోదు చేస్తారని ఢిల్లీ పోలీసులను జస్టిస్‌ బి.బి.నాగరత్న, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ఏ ఆధారాలతో ఐపీసీ సెక్షన్‌ 376 కింద కేసు పెట్టారు. ఇద్దరూ కలిసే జమ్మూ వెళ్లారు. ఏడుసార్లు ఆమె జమ్మూ వెళ్లినా భర్త అభ్యంతరం తెలపలేదు అని పేర్కొంది. నిందితుడిని ట్రయల్‌ కోర్టులో ప్రవేశపెట్టి, నిబంధనలకు లోబడి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

పోలీసుల ఫిర్యాదు ప్రకారం… ‘‘సోషల్ మీడియా ద్వారా దుస్తుల వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం మహిళ 2021లో ఇన్‌ఫ్లుయెన్సర్‌ను సంప్రదించారు. క్రమంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అయితే వ్యాపార ప్రకటనలు రూపొందించడం కోసం ఆమె కొనిచ్చిన ఐఫోన్‌ను విక్రయించడానికి యత్నించడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఐఫోన్‌ విక్రయించగా వచ్చిన మొత్తంలో రూ.20 వేలు మినహా మిగిలిన మొత్తాన్ని ఆమె బ్యాంకు ఖాతాకు బదిలీచేశాడు. మిగిలిన మొత్తాన్ని అందజేసే పేరుతో జమ్మూ నుంచి ఆ కుర్రాడు నొయిడాలోని ఆమె ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత వ్యాపార సంబంధ వీడియోల చిత్రీకరణ కోసం ఇద్దరూ వివిధ ప్రదేశాలు తిరిగారు.

అయితే మత్తు కలిపిన మిఠాయిలు తినిపించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగ్న చిత్రాలను వీడియోలో తీసి తరచూ బెదిరిస్తూ రెండున్నరేళ్లపాటు లైంగిక వేధింపులకు గురిచేశాడు. బెదిరించి డబ్బు వసూలు చేశాడు… అని ఆమె ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. తనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని యువకుడు కోరగా, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీనితో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మధ్యంతర బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే, బెయిల్‌ పై బయట ఉన్నప్పుడు ఈ మహిళను కలవొద్దని షరతు విధించింది.

Also Read : Indians: ఇరాన్‌ లో ముగ్గురు భారతీయుల కిడ్నాప్‌

Leave A Reply

Your Email Id will not be published!