Sushil Modi : మోదీ ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉంది. అసలు ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ప్రధానంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన కేంద్ర పరిధిలోని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దారుణం.
ఇలా ఎంత కాలం సభ్యులను నియమించకుండా కాలయాపన చేస్తారంటూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా అట్టడుగున ఉన్న వర్గాలకు లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నం చేయడం లేదంటూ ఫైర్ అయ్యింది.
దీంతో కోట్లాది మంది లబ్దిదారులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. విచిత్రం ఏమిటంటే ఈ ఏర్పాటైన స్టాండింగ్ కమిటీకి నేతృత్వం వహించింది భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడే కావడం విశేషం.
ప్రత్యేకించి కేంద్ర న్యాయ కమిషన్ చైర్ పర్సన్ , సభ్యుల నియామకాన్ని చేపట్టక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. సుశీల్ మోదీ (Sushil Modi)నేతృత్వంలో సామాజిక న్యాయం, సాధికారతపై పార్లమెంటరీ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది.
22వ లా కమిషన్ ను ఏర్పాటు చేయాలని రెండేళ్ల కిందట గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినా ఈరోజు వరకు ఎందుకు నియామకాలు చేపట్ట లేదని కేంద్ర న్యాయ శాఖ ను నిలదీసింది.
అంతే కాకుండా మైనార్టీ వ్యవహారాల శాఖలో బడ్జెట్ కేటాయింపు నిధులను ఎందుకు సద్వినియోగం కాలేదని ప్రశ్నించింది. అంతే కాకుండా 2019-22 మధ్య ఉచిత కోచింగ్ ఉప కార వేతనాల కోసం ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవడాన్ని తప్పు పట్టింది.
మరో వైపు సివిల్స్ వయో పరిమితిని సడలించాలని సూచించింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.
Also Read : దమ్ముంటే దావూద్ ను అరెస్ట్ చేయండి