Sakshi Office: ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడి ! ఫర్నీచర్ ధ్వంసం !

ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడి ! ఫర్నీచర్ ధ్వంసం !

Sakshi Office : ఇటీవల సాక్షి టీవీలో నిర్వహించిన కేఎస్ఆర్ లైవ్ షోలో అమరావతి ప్రాంత మహిళలపై యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్త్ కృష్ణంరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే వారిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు… కొమ్మినేనిని అరెస్ట్ చేయగా… కృష్ణంరాజు కోసం గాలిస్తున్నారు. మరోవైపు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కారణమైన సాక్షి యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు.

Sakshi Office Attack

ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై గుర్తు తెలయని వ్యక్తులు రాళ్ళ దాడికి దిగారు. ఈ దాడిలో సాక్షి కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సోఫా సెట్లు, ఫర్నిచర్‌ పూర్తిగా కాలిపోయింది. ఆఫీసు ఉద్యోగి కారు ధ్వంసమైంది. ఈ ప్రమాదంతో కార్యాలయం సిబ్బంది, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గత మూడు రోజులుగా సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ఆందోళణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read : SC ST Atrocity Case: తెలంగాణాలో ట్రైనీ ఎస్సీ, ఇద్దరు కానిస్టేబుళ్లపై అట్రాసిటీ కేసు

Leave A Reply

Your Email Id will not be published!