Telangana Govt : గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చి వేసేందుకు ‘హైడ్రా’ కు ఫుల్ పవర్స్

తాజా అధికారాలతో ఆక్రమణలకు సంబంధించి హైడ్రా నోటీసులు జారీ చేయనుంది...

Telangana : ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రా కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గురువారం నుంచి అధికారులు హైడ్రా(HYDRA) డైరెక్షన్ లోనే నోటీసులు జారీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో 199 విడుదల చేసింది. గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్ హైడ్రాకు ఇచ్చింది. జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది.. ఇక నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు. అక్రమ కట్టడాలకు నోటిసులు జారీ నుంచి కూల్చివేతల వరకు అన్నీ హైడ్రా చేయనుంది.

Telangana Govt Permission to…

జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు అధికారాలను హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా)కు బదలాయిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు (జీవో-191) జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ-1955 చట్టంలోని సెక్షన్‌ 374-బీ ప్రకారం చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రోడ్లు, డ్రైన్‌ల పరిరక్షించాల్సి ఉంటుంది. ఈ అధికారాలను హైడ్రాకు బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మంత్రివర్గ ఆమోదంతో ఆర్డినెన్సు ప్రతిపాదనలను గవర్నర్‌కు పంపింది. దీనిని ఆమోదిస్తూ ఈ నెల 3వ తేదీన గవర్నర్‌.. గెజిట్‌ విడుదల చేశారు. ఈ మేరకు తాజాగా పురపాలక శాఖ జీవో 191ను జారీ చేసింది. ఆర్డినెన్స్‌, జీవో జారీతో హైడ్రా(HYDRA) చర్యలకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని అధికార వర్గాలు చెబుతున్నాయి.

తాజా అధికారాలతో ఆక్రమణలకు సంబంధించి హైడ్రా నోటీసులు జారీ చేయనుంది. ఆయా నిర్మాణదారులు సంబంధిత అనుమతి పత్రాలు, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించని పక్షంలో స్పీకింగ్‌ ఆర్డర్స్‌ జారీ చేస్తుంది. వారు ఇచ్చే వివరణ అప్పటికీ సహేతుకంగా లేకుంటే నిర్మాణం కూల్చివేత/సీజ్‌ చేసే అధికారం హైడ్రాకు ఉంటుంది. చెరువులు, పార్కుల్లో అక్రమ నిర్మాణాలపై ఆదిలో ఉక్కుపాదం మోపిన హైడ్రా(HYDRA)… హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొంత కాలంగా ఆచితూచి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడంతోపాటు చెరువుల వాస్తవ విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిర్ధారణపై దృష్టి సారించింది. ఇందుకోసం సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఆర్‌ఎ్‌ససీ సాంకేతిక సహకారం తీసుకుంటోంది.

జీవో జారీ నేపథ్యంలో ఇక నుంచి చట్టపరంగా ముందుకు వెళ్లాలని సంస్థ భావిస్తోంది. వాస్తవానికి రోడ్లు, పార్కులు, చెరువుల్లో ఆక్రమణలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసే అధికారాలు జీహెచ్‌ఎంసీతోపాటు మునిసిపాలిటీలకు ఉన్నాయి. కానీ, కూల్చివేతలపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో నోటీసుల జారీ, స్పీకింగ్‌ ఆర్డర్స్‌ తర్వాతే హైడ్రా నిర్ణయం తీసుకోనుంది. ఔటర్‌రింగ్‌ రోడ్డు వరకు హైడ్రా పరిధి ఉన్న నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ వరకు జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ ప్రకారం, ఆవలి ప్రాంతాల్లోని 27 మునిసిపాలిటీలు/కార్పొరేషన్ల పరిధిలో మునిసిపల్‌ చట్టం ప్రకారం ముందుకు సాగనున్నట్టు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. తాజా జీవోతో హైడ్రా మరింత బలపడిందని, పూర్తి స్థాయిలో అధికారాలు వచ్చాయ న్నారు. అనధికార భవనాలను కూల్చివేయడంతోపాటు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారికీ హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందని తెలిపారు.

Also Read : Coming CJI : తదుపరి దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ‘సంజీవ్ ఖన్నా’

Leave A Reply

Your Email Id will not be published!