TG Govt : బాలికల కోసం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కార్

14 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయిలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతి రోజు....

TG Govt : తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కొత్త పథకానికి నేటి నుంచి శ్రీకారం చుట్టనుంది. బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పథకాన్ని గురువారం నుంచి అమలు చేయనుంది. ‘ఆడపిల్లలకు శక్తినిద్దాం.. ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’ అనే నినాదంతో ఈ సరికొత్త పథకాన్ని రేవంత్ సర్కార్ తీసుకు వచ్చింది.

TG Govt New Updates

14 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయిలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతి రోజు.. ఒక పల్లీ పట్టితోపాటు చిరుధాన్యాల పట్టీని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అమలు చేయనున్నారు. భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలో మంత్రి సీతక్క ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

Also Read : CM Revanth Reddy : తెలంగాణ మంత్రులకు సీఎం నివాసంలో ప్రైవేట్ పార్టీ

Leave A Reply

Your Email Id will not be published!