Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 5 కోట్లు

ద‌ర్శించుకున్న భ‌క్తులు 73,796

Tirumala Hundi : పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. సోమ‌వారం సైతం భ‌క్తులు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఓ వైపు భారీగా వ‌ర్షాలు కురుస్తున్నా తాకిడి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక శ్రీ‌వారికి నిత్యం భ‌క్తులు స‌మ‌ర్పించే కానుకలు, విరాళాల రూపేణా స్వామి వారి హుండీ ఆదాయం భారీగా వ‌చ్చింది. నిన్న ఒక్క రోజే ఏకంగా తిరుమ‌ల శ్రీ‌వారి ఆదాయం రూ. 5.00 కోట్లు వ‌చ్చింద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) వెల్ల‌డించింది.

Tirumala Hundi A Day

ఇదిలా ఉండ‌గా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 73 వేల 796 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. ఇక ఎప్ప‌టి లాగే త‌లనీలాలు స‌మ‌ర్పించుకున్న భ‌క్తుల సంఖ్య 28 వేల 840కి చేరుకుందని టీటీడీ వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా సెల‌వులు పూర్త‌యినా భ‌క్తులు పోటెత్త‌డం విస్తు పోయేలా చేస్తోంది టీటీడీ(TTD)ని. కాగా స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు తిరుమ‌ల లోని 15 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 18 గంట‌ల స‌మ‌యం ప‌ట్ట‌నుంద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తెలిపింది.

సుదూర ప్రాంతాల నుంచి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు టీటీడీ పాల‌క మండ‌లి చైర్మ‌న్ సుబ్బారెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డి వెల్ల‌డించారు.

Also Read : CM KCR Congrats : టమాటా రైతుకు సీఎం కంగ్రాట్స్

Leave A Reply

Your Email Id will not be published!