Amaravati: అమరావతిలో రెండు కొత్త ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

అమరావతిలో రెండు కొత్త ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

 

 

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. 2018 నుంచి పెండింగులో ఉన్న రెండు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. రూ 2,787 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ రెండు కొత్త ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ రెండు కొత్త ప్రాజెక్టుల్లో మొదటిది రూ. 1329 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మించడం కాగా, మరొకటి రూ.1458 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టడం.

ఈ రెండు ప్రాజెక్టులను సీపీడబ్ల్యూడీ నిర్మిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం తాజాగా ఆఫీసు మెమోరాండం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ ద్వారా వివరాలు వెల్లడించారు. 2018 నుంచి పెండింగులో ఉన్న ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసిందని హర్షం వ్యక్తం చేశారు.

 

ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని పునర్ నియామకం చేసిన ప్రభుత్వం

ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం పునర్ నియమించింది. తొమ్మిది మంది సభ్యులతో ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని నియామకం చేసింది. సభ్యులుగా ఫైబర్‌నెట్ ఎండీ, ఐటీశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీని నియమించింది. ఎస్ఎఫ్ఎల్‌లో డీపీఆర్‌లు, టెండర్ల పరిశీలనకు ఈ కమిటీ ఆమోదం తెలపనుంది. భారత్‌ నెట్ రెండో దశ కార్యాచరణ, అమలు వ్యవహారాలను ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీ చూడనుంది. నిర్ణీత వాణిజ్య, టెక్నికల్ కార్యాక్రమాలను ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీ పర్యవేక్షించనుంది.

 

Leave A Reply

Your Email Id will not be published!