Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో సూత్రధారులు అరెస్ట్

కిడ్నీ రాకెట్ కేసులో సూత్రధారులు అరెస్ట్

Kidney Racket : తెలంగాణాలో ఇటీవల వెలుగుచూసిన కిడ్నీ రాకెట్(Kidney Racket) కేసులో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన ఇద్దరు ఏజెంట్లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. చెన్నైకి చెందిన శంకరన్ అలియాస్ సాయి శంకరన్, ఎన్ రమ్యలను అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తెలంగాణకు(Telangana) తీసుకొచ్చారు. అంతేకాదు వారి పాస్ పోర్టులు, మొబైల్స్‌ను కూడా సీజ్‌ చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలోలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనితో ఈ కిడ్నీ రాకెట్ కు సంబంధించి ఇప్పటి వరకు 13మందిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లైంది. కిడ్నీ రాకెట్ కేసులో పరారీలో మరో ఏడుగురు నిందితులు ఉన్నారు. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది.

Kidney Racket Case Updates

నిందితులు తమిళనాడుకు చెందిన అమాయక, ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులను లక్ష్యంగా కిడ్నీ వ్యవహారం(Kidney Racket) నడుపుతున్నారు. బాధితులను తమిళనాడు నుండికు తీసుకువచ్చి హైదరాబాద్‌ లో కిడ్నీ రాకెట్‌ ముఠా నడిపిస్తున్నాడు. ఇలా ప్రతి కిడ్నీ మార్పిడికి నిందితులు రూ.10 లక్షల కమిషన్‌ తీసుకుంటున్నారు. కిడ్నీ దాతలకు రూ.4-5 లక్షలు ఇస్తున్నారు. కాగా,ఇదే కేసులో మరో ఏడుగురు నిందితుల కోసం తెలంగాణ పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ కేసు పెను దుమారం సృష్టిస్తోంది. ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈ కేసును సీఐడీ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. ఈ దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేస్ సీఐడీకి బదిలీ అయిన తర్వాత ఇద్దరినీ తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

కాగా, అలకనంద ఆస్పత్రిలో జరిగే కిడ్నీ ఆపరేషన్లపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకుండా కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై సంబంధిత ఆస్పత్రి యాజమాన్యాన్ని సీఐడీ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి. దర్యాప్తు ముమ్మరంగా జరుపుతున్న కొద్దీ ఈ రాకెట్‌కు దేశవ్యాప్తంగా ఉన్న లింకులు బయటపడుతున్నాయి. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు.

సీఐడీ అధికారులు ఇప్పటికే సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు. నిందితుల మొబైల్ ఫోన్లు, వాటిలోని వాట్సాప్ చాట్స్, బ్యాంకు లావాదేవీలు, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా అధికారులు విచారణ చేస్తున్నారు. ఇదే క్రమంలో పాసుపో‌ర్టులను, విదేశీ కాల్‌లాగ్స్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఏ ఒక్క నిందితుడు తప్పించుకోలేనంతగా ఫోరెన్సిక్ ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు.

Also Read : MP Etala Rajender: ఎమ్మెల్సీ కవిత‌పై ఎంపీ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!