MP Bandi Sanjay: బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కాన్వాయ్‌ పై కోడిగుడ్ల దాడి !

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కాన్వాయ్‌ పై కోడిగుడ్ల దాడి !

MP Bandi Sanjay: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కు పరాభవం ఎదురైయింది. ప్రజాహిత యాత్రలో భాగంగా వంగరలో పర్యటించిన ఎంపీ బండి సంజయ్(MP Bandi Sanjay) కాన్వాయ్‌ పై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేసారు. దుండగులు విసిరిన కోడిగుడ్లు బండి సంజయ్ కాన్వాయ్ లోని మీడియా వాహనంపై పడ్డాయి. దీనితో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ బండి సంజయ్… వంగరలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఇంటిని సందర్శించారు. అనంతరం అక్కడ నుండి ముల్కనూర్‌ బయల్దేరుతుండగా ఈ ఘటన జరిగింది. దీనితో పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.

MP Bandi Sanjay Unknown Miscreants Attack

ఈ ఘటనపై బండి సంజయ్‌ మాట్లాడుతూ… పోలీసుల సమక్షంలో ఓ ఎంపీపై కోడిగుడ్లతో దాడి జరిగినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రజా ప్రతినిధికే భద్రత కల్పించలేని పోలీసులు సామాన్యులకు ఎలా భద్రత కల్పిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాకు భద్రత అక్కర్లేదు. పోలీసులు నాతో రావొద్దు. నా రక్షణ మా కార్యకర్తలే చూసుకుంటారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయారు.

Also Read : Vasantha Nageswara Rao : ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని కావాలంటే జగన్ సర్కార్ ని ఓడించాల్సిందే

Leave A Reply

Your Email Id will not be published!