USA Order : భారత్ లోని ఆ ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరిక

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులోని 10 కి.మీల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉందని....

USA : భారత్‌లో ఉంటున్న తమ దేశ పౌరులకు అమెరికా(America) హెచ్చరికలు జారీ చేసింది. మణిపుర్‌, జమ్ము కశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు యాక్టివ్‌గా ఉన్న మధ్య, తూర్పు భారత దేశ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తుంటే మళ్లీ ఆలోచించాలంటూ రివైజ్డ్‌ ట్రావెల్‌ అడ్వైజరీని ఆ దేశ విదేశాంగ శాఖ విడుదల చేసింది. దేశంలో పెరిగిపోతున్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

USA Orders to..

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులోని 10 కి.మీల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉందని.. అటువైపు వెళ్లొద్దని, తూర్పు లద్దాఖ్ ప్రాంతం, లేహ్‌ మినహా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం పేట్రేగుతోందని అక్కడ పర్యటించడం శ్రేయస్కరం కాదని హెచ్చరించింది. ఉగ్రవాదం, హింసాత్మక ఘటనల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనపై పునరాలోచించాలని సూచించింది. పర్యాటక ప్రాంతాలు, ఇతర చోట్ల అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి హింసాత్మక నేరాలు జరిగాయని భారతీయ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతాలు, రవాణా కేంద్రాలు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారని అమెరికా(America) తెలిపింది.

భారత్‌-పాక్‌ మధ్య నియంత్రణ రేఖ (LoC) వెంబడి హింసాత్మక ఘటనలు సాధారణంగా జరుగుతుంటాయని.. ఇది కశ్మీర్‌లోయలోని పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్‌, గుల్‌మార్గ్‌, పహల్గామ్‌లలో చోటుచేసుకుంటాయని వెల్లడించింది. అందువల్ల ఈ పర్యాటక ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు భారత ప్రభుత్వం కూడా విదేశీ పర్యటకులను అనుమతించొద్దని కోరింది. సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనిక బలగాలు మోహరించి ఉంటాయని.. తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్‌ మీదుగా విస్తరించి ఉన్న ప్రాంతంలో మావోయిస్టులు చురుగ్గా ఉంటాయని తెలిపింది.

తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, బిహార్‌, బెంగాల్‌, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, యూపీలలో ప్రభుత్వ అధికారులపై దాడులు జరుగుతున్నాయని, ఒడిశాలోని నైరుతీ ప్రాంతంలోనూ ఈ ప్రభావం ఉందన్నారు. మావోయిస్టులు స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలు, ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తున్నారని తెలిపింది. ఈ ముప్పు తీవ్రత కారణంగా అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు బిహార్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్, బెంగాల్‌, మేఘాలయ, ఒడిశా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

రాష్ట్రాల రాజధానులకు వెళ్తే అనుమతి అవసరం లేదని.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తూర్పు ప్రాంతానికి వెళ్లడానికి మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈశాన్య ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పలు జాతులకు చెందిన గ్రూపులు పాల్పడుతున్నాయని తెలిపింది. ఈ ఘటనల్లో బస్సులు, రైళ్లు, రైలు మార్గాలు, మార్కెట్లపై బాంబు దాడులు జరుగుతున్నాయని హెచ్చరించింది. కాబట్టి.. భారత్‌లో ఉన్న అమెరికన్లకు హెచ్చరికలు జారీ చేసింది.

Also Read : Nara Chandrababu Naidu: ఏపీలో మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తాం – సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!