Wife: ఆస్తి ప్రియురాలికి కట్టబెట్టడంతో భర్తపై పెట్రోలు పోసిన చంపిన భార్య
ఆస్తి ప్రియురాలికి కట్టబెట్టడంతో భర్తపై పెట్రోలు పోసిన చంపిన భార్య
Wife : క్రిష్ణగిరి జిల్లా కావేరిపట్టణం సమీపంలోని తిమ్మాపురం ప్రాంతానికి చెందిన కూలి కార్మికుడు రంగస్వామి (47) నిద్రిస్తుండగా… అతని భార్య కవిత(44) పెట్రోలు పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే. రంగస్వామి క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన క్రిష్ణగిరి (Krishnagiri) పోలీసులు… రంగస్వామి భార్య కవితను అరెస్ట్ చేసి… దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ దర్యాప్తులో కవిత సంచలన విషయాలు వెల్లడించింది.
Wife Reveals Truth
పోలీసుల విచారణలో కవిత… తమకు పెళ్లి జరిగి 22 ఏళ్లు అయ్యిందని, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారని, తమకు ఆస్తి, డబ్బు, నగలు అన్నీ ఉన్నాయని, కుటుంబంతో బాగానే ఉన్నామని తెలిపింది.అయితే భర్త కూలి పని చేసే చోట మరో మహిళ మంజులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. ఇంట్లో ఉన్న నగలు మంజులకు అందజేశాడు. ఆస్తిని విక్రయించి ఆమెకు ముట్టజెప్పాడని తెలిపింది. రోజూ తాగి వచ్చి అందంగా లేవని నన్ను దూషించేవాడని… దీనితో హత్య చేశానని చెప్పింది. కాగా తండ్రి మరణించి, తల్లి జైలుకెళ్లి ముగ్గురు పిల్లలు బోరుమని విలపించారు.
Also Read : Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య ! హిండన్ ఎయిర్ పోర్ట్ లో నిలిపివేత !