Woman: కౌన్సిలర్‌ ప్రాణం బలికొన్న రౌడీషిటర్‌ తో వివాహేతర సంబంధం

కౌన్సిలర్‌ ప్రాణం బలికొన్న రౌడీషిటర్‌ తో వివాహేతర సంబంధం

Woman : రౌడీషిటర్‌ తో వివాహేతర సంబంధం తమిళనాడులో (Tamil Nadu) వీసీకే మహిళా కౌన్సిలర్‌ ప్రాణాలను బలితీసుకుంది. ఓ రౌడీషిటర్‌ తో ఇన్‌స్ట్రాగామ్‌లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడంతో… ఆమె తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైయింది. భర్త, పిల్లలను వదిలి రౌడీషిటర్‌తో సహజీవనం కొనసాగించడానికి సిద్ధమైన మహిళా కౌన్సిలర్‌ ను భర్త దారుణంగా హతమా ర్చాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Woman Killed

తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్‌ పెద్దకాలనీకి చెందిన కోమది(28) తిరునిండ్రవూర్‌ 26వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పని చేస్తున్నారు. ఈమె భర్త స్టీఫెన్‌రాజ్‌(38) తిరునిండ్రవూర్‌ పట్టణ వీసీకే కార్యదర్శిగా కొనసాగు తున్నారు. వీరిద్దరు 2015లో ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. కాగా స్టీఫెన్‌రాజ్, భార్య కోమది, అతని సోదరుడు అజిత్, తల్లిదండ్రులు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కోమదికి తిరునిండ్రవూర్‌ రామదాస్‌పురం ప్రాంతానికి చెందిన రౌడీషిటర్‌ మోసస్‌దేవతో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీనితో భర్త, పిల్లలను వదిలిపెట్టి… రౌడీషీటర్ మోసస్ దేవతో సహాజీవనం చేయడానికి కోమది సిద్ధమైంది.

అయితే రెండు నెలల క్రితం మోసస్‌దేవాతో కోమది సన్నిహితంగా ఉన్న ఫొటోలను అజిత్‌ గుర్తించాడు. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యా యి. ఈ విషయమై కోమదిని భర్త స్టీఫెన్‌రాజ్‌ పలుమార్లు మందలించినా మరింత సన్నిహితంగా ఉండడం ప్రారంభించింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి ఆటోలో కోమది బయలుదేరింది. దీనితో అజిత్, స్టీఫెన్‌రాజ్‌ ఆమెను వెంబడించారు. కోమది ఆవడి సమీపంలోని నడుకుత్తగై ప్రాంతంలో మోసస్‌దేవాతో సన్నిహితంగా ఉన్నట్టు స్టీఫెన్‌రాజ్‌ గుర్తించి ఆగ్రహించి కత్తితో కోమదిని దారుణంగా నరికి పరారయ్యారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసి రౌడీ షీటర్‌ పరారయ్యాడు. విషయం తెలిసి అసిస్టెంట్‌ కమిషనర్‌ గిరి, పోలీసులు మృతదేహాన్ని ప్రభు త్వాస్పత్రికి తరలించారు. స్టీఫెన్‌రాజ్, అజిత్, తల్లిని పోలీసులు అరెస్టు చేశారు.

Also Read : Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో అపశృతి ! రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు !

Leave A Reply

Your Email Id will not be published!