Nara Chandrababu Naidu: చంద్రబాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగులు !

చంద్రబాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగులు !

Nara Chandrababu Naidu: తనని చూసేందుకు కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టిన ఓ మహిళను చూసి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు… కారు ఆపి ఆమెను పలకరించిన ఆసక్తికర ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశం మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగింది. సమావేశం అనంతరం ఉండవల్లికి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టింది. ఆమెను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్‌ ఆపి దగ్గరకు పిలిచి మాట్లాడారు. తన పేరు నందిని అని… తమరిని చూసేందుకు మదనపల్లి నుంచి వచ్చానని చెప్పింది. సెక్యూరిటీని వారించి చంద్రబాబు ఆమె వివరాలు తెలుసుకున్నారు.

Nara Chandrababu Naidu…

కష్టం ఫలించి… మా కోరిక మేరకు సీఎం అయ్యారు సార్‌… ఒక్కసారి మీ కాళ్లు మొక్కుతానని ఆ మహిళ అనగా… చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఫొటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడటానికి వచ్చానని చెప్పగా… ముందు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకొని అవసరమైన వైద్యం అందించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

Also Read : KCR: కేసీఆర్‌కు పవర్‌ కమిషన్‌ నోటీసులు !

Leave A Reply

Your Email Id will not be published!