Yashwant Sinha : కేసీఆర్ ద‌మ్మున్నోడు విజ‌న్ ఉన్నోడు – సిన్హా

ప్ర‌శంసించిన విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి

Yashwant Sinha : విప‌క్షాల ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా(Yashwant Sinha) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సీఎం ఆహ్వానం మేర‌కు హైద‌రాబాద్ వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా జ‌ల విహార్ లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో య‌శ్వంత్ సిన్హా ప్రసంగించారు. కేసీఆర్ దమ్మున్న లీడ‌ర్ అని, మ‌స్తు విజ‌న్ కూడా ఉంద‌ని కితాబు ఇచ్చారు.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లే ప్రామాణికం కాదు. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి అన్న‌ది అలంకార ప్రాయంగా ఉండ కూడ‌ద‌నే తాను బ‌రిలో ఉన్నానని చెప్పారు. కేవ‌లం ఓ సంత‌కానికో లేదా ర‌బ్బ‌ర్ స్టాంపు గా మిగిలి పోకూడ‌ద‌ని చెప్పారు సిన్హా.

భార‌త రాజ్యాంగం ప్ర‌కారం దేశం న‌డ‌వాల్సి ఉంటుంద‌ని, ఆ దిశ‌గా ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇవాళ అలాంటి ప‌రిస్థితులు లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎన్నిక‌ల వ‌ర‌కే త‌న పోరాటం ఆగ‌ద‌ని, దేశ ప్ర‌జ‌ల కోసం, సంక్షేమం కోసం త‌న పోరాటం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు య‌శ్వంత్ సిన్హా. త‌న‌కు ఇంత‌టి భారీ స్థాయిలో స్పంద‌న ల‌భిస్తుంద‌ని అనుకోలేద‌ని చెప్పారు.

అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ప్ర‌త్యేకించి ఏర్పాట్లు చేసిన సీఎం కేసీఆర్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు సిన్హా. టీఆర్ఎస్ త‌ర‌పున కేటీఆర్ ఢిల్లీకి రావ‌డం త‌న‌కు మ‌రింత బ‌లాన్ని ఇచ్చింద‌ని ప్ర‌శంసించారు.

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక అనేది ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ధ్య పోటీ కాద‌ని ఇద్ద‌రి ఆలోచ‌న‌లు, సిద్దాంతాల మ‌ధ్య పోటీ అని స్ప‌ష్టం చేశారు. సంకల్పంతో ముందుకు వెళితే విజ‌యం వ‌రిస్తుంద‌ని తాను న‌మ్ముతాన‌ని అన్నారు సిన్హా.

Also Read : అంజ‌న్న అరెస్ట్ పై రేవంత్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!