Ekta Kapoor : నిర్మాత ఏక్తా..శోభా క‌పూర్ కు అరెస్ట్ వారెంట్

మ‌ద‌ర్ ఓవ‌ర్ వెబ్ సీరీస్ పై అభ్యంత‌రం

Ekta Kapoor : ప్ర‌ముఖ నిర్మాత, ద‌ర్శ‌కురాలు ఏక్తా క‌పూర్ (Ekta Kapoor) కు కోలుకోలేని షాక్ త‌గిలింది. త్రిబుల్ ఎక్స్ మ‌ద‌ర్ ఓవ‌ర్ వెబ్ సీరీస్ ను రూపొందిస్తోంది. ఈ సీరీస్ ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ ద్వారా స్ట్రీమింగ్ కానుంది.

త్రిబుల్ ఎక్స్ సీజ‌న్ -2 సీరీస్ లో సైనికుడి భార్య‌కు సంబంధించిన ప‌లు అభ్యంత‌ర స‌న్నివేశాలు ఉన్నాయ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏక్తా క‌పూ్ యాజ‌మాన్యంలోని ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ అయిన అల్ టి బాలీజీలో ఈ సీరీస్ ప్రసారం చేశారు.

త‌మ మ‌నో భావాలు దెబ్బ‌తిన్నాయనే ఆరోప‌ణ‌ల‌పై ఏక్తా క‌పూర్ తో పాటు త‌ల్లి శోభా క‌పూర్ ల‌పై బీహార్ లోని బెగుస‌రాయ్ లోని కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. బెగుస‌రాయ్ కు చెందిన మాజీ సైనికుడు శంభు కుమార్ చేసిన ఫిర్యాదు ఆధారంగా న్యాయ‌మూర్తి వికాస్ కుమార్ ఈ వారెంట్ జారీ చేశారు.

త‌న ఫిర్యాదులో త్రిబుల్ ఎక్స్ సీజన్ -2 సీరీస్ లో సైనికుడి భార్య‌కు సంబంధించిన అనేక అభ్యంత‌ర‌క‌ర సీన్స్ ఉన్నాయ‌ని ఆరోపించారు.

ఈ సీరీస్ ఏక్తా క‌పూర్ ఆధీనంలోని బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ యాజ‌మాన్యంలోని ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ అయిన ఏఎల్టీ బాలాజీలో టెలికాస్ట్ జ‌రిగింది. ఏక్తా కపూర్ తో పాటు త‌ల్లి శోభా క‌పూర్ కూడా బాలాజీ టెలిఫిల్మ్స్ తో సంబంధం క‌లిగి ఉంద‌ని శంభు కుమార్ న్యాయ‌వాది హృషి కేష్ పాఠ‌క్ స్ప‌ష్టం చేశారు.

కోర్టు ఆ ఇద్ద‌రికీ స‌మ‌న్లు జారీ చేసింది. త‌ల్లీ కూతుళ్లు ఇద్ద‌రూ కోర్టుకు హాజ‌రు కావాల‌ని ఆదేశించింద‌ని చెప్పారు.

Also Read : రీమిక్స్ క‌ల్చ‌ర్ పై రెహ‌మాన్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!