Shah Rukh Khan : ముంబై ఎయిర్ పోర్ట్ లో షారుక్ నిలిపివేత‌

రూ. 18 ల‌క్ష‌ల విలువైన గ‌డియారాలు ల‌భ్యం

Shah Rukh Khan : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఆయ‌న‌ను కొద్ది సేపు నిలిపి వేశారు. త‌ర్వాత వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. షారుక్ ఖాన్ వెళుతున్న స‌మ‌యంలో చెకింగ్ వ‌ద్ద నిలిపి వేశారు.

ఆయ‌న లగేజీ బ్యాగ్ లో భారీ ఎత్తున ఖ‌రీదైన వాచ్ లు ఉన్న‌ట్లు గుర్తించారు క‌స్ట‌మ్స్ అధికారులు. దీంతో బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఎయిర్ పోర్ట్ లోనే నిలిపి వేశారు. క‌స్ట‌మ్స్ డ్యూటీలో భాగంగా రూ. 6.83 ల‌క్ష‌లు చెల్లించాల్సి ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

దుబాయ్ లోని షార్జాలో ఇటీవ‌ల ఇంట‌ర్నేష‌న‌ల్ బుక్ ఫెయిర్ నిర్వ‌హించారు. ఇందులో బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఈ ఫెయిర్ కు హాజ‌ర‌య్యారు. అక్క‌డి నుంచి ముంబైకి వ‌చ్చారు. గ‌త రాత్రి న‌టుడిని క‌స్ట‌మ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రి బ్యాగుల్లో ఖ‌రీదైన వాచీలు ఉన్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటే ముందు రూ. 6.83 ల‌క్ష‌లు క‌స్ట‌మ్స్ డ్యూటీ కింద చెల్లించాల‌ని స్ప‌ష్టం చేశాయి.

షారుఖ్ ఖాన్ ప్రైవేట్ ఎయిర్ జెట్ లో ముంబై ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టులోని టెర్మిన‌ల్ 3 వ‌ద్ద దిగాడు. ఖాన్ తో పాటు ఆయ‌న వెంట వ‌చ్చిన వారి బ్యాగుల్లో ఖ‌రీదైన వాచీలు బ‌య‌ట ప‌డ్డాయి.

రాత్రంతా షారుఖ్ ఖాన్ ను ఎయిర్ పోర్ట్ లోనే ఉంచిన‌ట్లు స‌మాచారం. రూ. 18 ల‌క్ష‌ల విలువైన ఆరు ఖ‌రీదైన గ‌డియారాలు ఉన్నాయి.

Also Read : దీపికా త‌ర‌గ‌ని అందం నీది – బాద్ షా

Leave A Reply

Your Email Id will not be published!