Swara Bhaskar : రాహుల్ గాంధీకి స్వ‌ర భాస్క‌ర్ కితాబు

భార‌త్ జోడో యాత్ర అద్భుతం

Swara Bhaskar : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర నిరాటంకంగా కొన‌సాగుతోంది. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి ప్రారంభ‌మైన ఈ యాత్ర త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో పూర్త‌యింది. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొన‌సాగుతోంది.

ఈ సంద‌ర్బంగా పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చిన్నారుల నుంచి పెద్ద‌లు, వృద్దుల దాకా అంతా రాహుల్ గాంధీ వెంట న‌డుస్తున్నారు. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు భారత్ జోడో యాత్ర‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

తాజాగా బాలీవుడ్ కు చెందిన న‌టి స్వ‌ర భాస్క‌ర్ కితాబు ఇచ్చారు రాహుల్ గాంధీకి. ఒకానొక స‌మ‌యంలో రాహుల్ గాంధీపై నోరు పారేసుకున్నారు కూడా.

వ్య‌క్తిగ‌త‌మైన వైరుధ్యాలు ఉన్న‌ప్ప‌టికీ రాహుల్ గాంధీ మ‌తాల ప్రాతిప‌దిక‌న లేదా సంచ‌లాన‌త్మ‌క రాకీయాల‌కు లొంగి పోలేద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు స్వ‌ర భాస్క‌ర్(Swara Bhaskar).

ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయ‌ని, కేంద్రంలో కొలువు తీరిన న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంబిస్తోంద‌ని పేర్కొన్నారు.

ఈ స‌మ‌యంలో రాహుల్ గాంధీ పాద‌యాత్ర చేప‌ట్డ‌డం అభినంద‌నీయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా భార‌త్ జోడో యాత్రపై బాలీవుడ్ న‌టి స్వ‌ర భాస్క‌ర్ ప్ర‌శంసించ‌డాన్ని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మీడియా ఇన్ ఛార్జ్ జైరాం ర‌మేష్ కితాబు ఇచ్చారు.

ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో రాహుల్ గాంధీ యాత్ర కొన‌సాగించడం అభినంద‌నీయం. ఆయ‌న మ‌రిన్ని స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించాల‌ని స్వ‌ర భాస్క‌ర్ కోరారు.

Also Read : ఎలాన్ మ‌స్క్ కు రాహుల్ గాంధీ కంగ్రాట్స్

Leave A Reply

Your Email Id will not be published!