Anand Mahindra : అగ్నివీరుల‌కు మ‌హీంద్ర స్వాగ‌తం

బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన వ్యాపార‌వేత్త

Anand Mahindra : కేంద్రం ప్ర‌వేశ పెట్టిన అగ్ని ప‌థ్ స్కీం పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ఆందోళ‌న‌లతో అట్టుడుకుతోంది. బీహార్ లో మొద‌లైన ఈ అగ్నిప‌థ్ దేశంలోని అన్ని ప్రాంతాల‌కు పాకేలా చేసింది.

వంద‌లాది మంది నిర‌స‌న‌కారుల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో తెలిపిన నిర‌స‌న తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారితీసింది.

దాదాపు రూ. 30 కోట్ల‌కు పైగా భారీ న‌ష్టం వాటిల్లింది. ఈ ఘ‌ట‌న‌లో రైల్వే పోలీసులు కాల్పులు జ‌రిపారు. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన రాకేశ్ అనే యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఇదే స‌మ‌యంలో అగ్నిప‌థ్ స్కీం నిర‌స‌న‌లో 46 మందిని అరెస్ట్ చేసిన‌ట్లు చెప్పారు రైల్వే శాఖ ఎస్పీ అనురాధ‌. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 16 మందికి గాయాలైన‌ట్లు వెల్ల‌డించారు.

ఇందులో 8 మందికి పోలీసులు గాయ‌ప‌డ్డారు. మిగ‌తా యువ‌కులు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ త‌రుణంలో యువకులు పెద్ద ఎత్తున కేంద్రంపై భ‌గ్గుమంటున్నారు.

దీనిపై స్పందించారు ప్ర‌ముఖ భార‌తీయ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా(Anand Mahindra) . ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. అగ్నిప‌థ్ వీరులకు తాను ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

దేశానికి సంబంధించి ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా ముందుగా త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తూ వ‌స్తున్నారు ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) . క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన అగ్ని వీరుల‌కు బంగారు భ‌విష్య‌త్తు త‌ప్ప‌క ఉంటుంద‌ని పేర్కొన్నారు.

విజ‌య‌వంతంగా ట్రైనింగ్ తీసుకున్న వారికి మ‌హీంద్రా గ్రూపులో చాన్స్ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు.

Also Read : సైబ‌ర్ సురక్షిత దేశంగా భార‌త్ – అమిత్ షా

Leave A Reply

Your Email Id will not be published!