Australia: సీమాంతర ఉగ్రవాదంపై భారత్ పోరుకు ఆస్ట్రేలియా మద్దత్తు
సీమాంతర ఉగ్రవాదంపై భారత్ పోరుకు ఆస్ట్రేలియా మద్దత్తు
Australia : ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరతల కోసం వ్యూహాత్మక సహకారం ఇచ్చిపుచ్చుకునేందుకు భారత్, ఆస్ట్రేలియాలు అంగీకరించాయి. భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్ మార్లెస్ బుధవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడికి స్పందనగా భారత్ చేపట్టిన చర్యలకు మద్దతు తెలిపిన ఆస్ట్రేలియాకు రాజ్నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ మద్దతుతో సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు భారత్ కు ఉందని ఆస్ట్రేలియా(Australia) ఉప ప్రధాని మార్లెస్ అన్నారు.
భారత్ చేపట్టిన చర్య కచ్చితంగా, బాధ్యతగా, ఉద్రిక్తతలు పెరగకుండా ఉండే విధంగా ఉందని ఆయన అన్నారు. సమగ్ర, వ్యూహాత్మ భాగస్వామ్యం పరస్పరం అందించుకోవాలని భారత ఆస్ట్రేలియాలు(Australia) అంగీకారానికి వచ్చి బుధవారంతో ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మార్లెస్ చేపట్టిన భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి కూడా అయిన మార్లెస్ తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఆ సమావేశంలో సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరుకు తమ మద్దతు ఉంటుందని మార్లెస్ తెలిపారు. ఇరుదేశాలు రక్షణ పారిశ్రామిక రంగాల్లో కూడా సహకరించుకోవాలని అంగీకారం కుదిరినట్టు అధికారిక ప్రకటన తెలియజేసింది.
Australia – స్వదేశీ ఆయుధాలతో సత్తా చాటాం – ప్రధాని మోదీ
మన దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలతో ఆపరేషన్ సిందూర్లో సత్తా చాటామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాలానుగుణంగా యుద్ధతంత్రాలు మారుతూ వస్తున్నాయని… ఇక ముందు భారత్ లో ‘మేకిన్ ఇండియా’ ఆయుధాలు, వ్యవస్థలకే ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో మూడున్నర గంటల పాటు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మంత్రులతో భేటీ ఇదే తొలిసారి కూడా. పాకిస్థాన్ తో ఉద్రిక్తతల సమయంలో భారత్ చూపిస సత్తాపై ఈ భేటీలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.
మన రక్షణ శాఖ చెప్పినదానికంటే ఎక్కువగా నష్టం జరిగినట్టుగా పాకిస్థాన్ స్వయంగా బయటపెట్టిన అంశాన్ని కూడా ఇందులో ప్రస్తావించినట్టు తెలిసింది. ఇక ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి సర్కారు ఏర్పాటై ఈ నెల 9వ తేదీకి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో… వివిధ మంత్రిత్వ శాఖలు సాధించిన విజయాలపై మరో ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు సమాచారం. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ, జలశక్తి శాఖ విజన్ 2047 ప్రణాళికలను వివరించినట్టు తెలిసింది. మరోవైపు దేశంలో ఏటేటా పెరిగిపోతున్న ఊబకాయం సమస్య, ఆరోగ్యకర జీవన శైలిని అనుసరించాల్సిన అవసరంపై ఆరోగ్య శాఖ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం.
Also Read : Russia-Ukarine : యుక్రెయిన్ పై ప్రతీకార చర్య తప్పదంటున్న రష్యా