Gaddam Prasad Kumar: తెలంగాణా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ పై ‘ఈసీ’కి ఫిర్యాదు !

తెలంగాణా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ పై ‘ఈసీ’కి ఫిర్యాదు !

Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి మంగళవారం ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ బద్దమైన స్పీకర్ పదవిలో ఉండి గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రచారంలో పాల్గొంటున్నారంటూ హైదరాబాద్‌ లో చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి(సీఈవో) వికాస్‌ రాజ్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదు చేసిన అనతంరం బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…

Gaddam Prasad Kumar Case

‘అసెంబ్లీ స్పీకర్‌గా ఉండి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డికి ఓటు వేయాలని సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. స్పీకర్‌ ప్రచారం చేసిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సీఈవో వికాస్‌రాజ్‌కు అందించాం. ఆ ఆధారాలను బట్టి ఎన్నికల కమీషన్ తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తోంది’ అని ప్రేమేందర్‌రెడ్డి మండిపడ్డారు.

Also Read : IPS Transfers: ఏపీలో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లపై బదిలీ వేటు !

Leave A Reply

Your Email Id will not be published!