Botsa Satyanarayana : ముంద‌స్తు ముచ్చ‌ట అబ‌ద్దం

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ

Botsa Satyanarayana : ఏపీలో త‌మ పార్టీకి తిరుగు లేద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌(Botsa Satyanarayana). దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న ఘ‌న‌త వైసీపీకే ఉంద‌న్నారు. యువ , డైన‌మిక్ లీడ‌ర్ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌తిప‌క్షాలు టీడీపీ, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలు ఎన్ని వ్యూహాలు ప‌న్నినా వాళ్ల‌కు సింగిల్ డిజిట్ కూడా రావ‌ని జోష్యం చెప్పారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.

విద్యా శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్ర‌తిప‌క్షాల‌కు అల‌వాటుగా మారింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కావాల‌ని తాము ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ‌తామంటూ దుష్ప్ర‌చారం చేస్తున్నాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏపీ మంత్రి. ఇవాళ త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌నాడు నేడు దేశానికే ఆద‌ర్శంగా మారింద‌ని అన్నారు.

విప‌క్షాలు సింగిల్ గా బ‌రిలోకి దిగినా లేక విప‌క్షాలు క‌లిసి పోటీ చేసినా వైఎస్సార్ సీపీ ని ఎదుర్కోలేవ‌ని జోష్యం చెప్పారు. త‌మ పార్టీకి ఉన్నంత మంది బ‌ల‌గం ఏ పార్టీకి లేద‌న్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా త‌మ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేయింబ‌వ‌ళ్లు కృషి చేస్తున్నార‌ని కితాబు ఇచ్చారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.

Also Read : AP CM YS Jagan I-PAC : ఐ ప్యాక్ టీమ్ తో జ‌గ‌న్ ముచ్చ‌ట‌

Leave A Reply

Your Email Id will not be published!