CEC Gyanesh Kumar: ఓటర్ల జాబితాపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఓటర్ల జాబితాపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు
CEC Gyanesh Kumar : ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలో ఓటర్ల జాబితా రూపకల్పన అనేది ప్రపంచంలోని అత్యంత పకడ్బందీ, పారదర్శకమైన ప్రక్రియల్లో ఒకటని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్(CEC Gyanesh Kumar) తెలిపారు. చట్టప్రకారం ప్రతి ఏడాది ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతుందని, ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు జాబితాను అందజేస్తామని చెప్పారు. ఎన్నికల సమగ్రతపై స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో సీఈసీ కీలకోపన్యాసం చేస్తూ, 1960 నుంచి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఓటర్ల జాబితాను షేర్ చేసుకుంటున్నట్టు చెప్పారు. దానిపై క్లెయిమ్స్, అభ్యంతరాలు, అప్పీల్కు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ కోసం ఓటర్ల జాబాతాలో అవకతవకలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీఈసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
CEC Gyanesh Kumar Key Comments
ఎన్నికల ప్రక్రియ మొత్తం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు, పోలీసులు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, మీడియా నిరంతరం పర్యవేక్షిస్తుంటారని సీఈసీ(CEC) చెప్పారు. పోలింగ్ సిబ్బంది, పోలీసు బలగాలు, అబ్జర్వర్లు, రాజకీయ పార్టీల ఏజెంట్లతో సహా 2 కోట్ల మందికి పైగా సిబ్బందితో ఎన్నికల కమిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా నిలుస్తోందన్నారు. ఇందువల్లే సుమారు 100 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతున్నాయని చెప్పారు.
కాగా, ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఘన విజయం సాధించాల్సినచోట్ల, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్తో గెలుపొందిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. అప్పుడప్పుడూ మన ఎన్నికల్లో నిజాయతీ లోపిస్తోందని.. జాతీయ సంస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని అవకతవకలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ శాతం 58.22% ఉంటే మర్నాడు 66.05 శాతానికి ఎగబాకడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే స్పందించగలమని తెలిపింది. బీజేపీ సైతం కాంగ్రెస్ను తప్పుపడుతూ, ఓటమి ఎదురైన ప్రతిసారీ ఇలాంటి ఆరోపణలు చేయడం ఆ పార్టీకి పరిపాటైందని విమర్శించింది.
Also Read : Woman: సంరక్షకురాలి ముసుగులో రిటైర్డ్ ప్రోఫెసర్ నుండి ఆస్తులు కాజేసిన మహిళ