Chiranjeevi Garikapati : గరికపాటి వివాదానికి ‘చిరు’ పుల్ స్టాప్
సంయమనం పాటించాలన్న మెగాస్టార్
Chiranjeevi Garikapati : దత్తన్న నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ఆధ్యాత్మికవేత్త గరికపాటి మధ్య చోటు చేసుకున్న వివాదం ఎట్టకేలకు పుల్ స్టాప్ పడింది. సినీ రంగానికి చెందిన వారితో పాటు చిరంజీవి సోదరుడు నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు గరికపాటి నరసింహారావుపై (Chiranjeevi Garikapati) .
ఇక గీత రచయిత అనంత శ్రీరామ్ అయితే ఏకంగా సెటైరిక్ గా పద్యం వినిపించారు గరికపాటి స్టైల్లో. మరికొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. గత వారం రోజులుగా విమర్శల పరంపర కొసాగుతూనే ఉన్నది. సినీ రంగానికి చెందిన ఇతర టెక్నిషియన్లు సైతం గరికపాటిపై నోరు పారేసుకున్నారు.
మెగాస్టార్ పట్ల తమ వీర విధేయతను చాటుకున్నారు. ఇదిలా ఉండగా అలయ్ బలయ్ సందర్భంగా ఫోటో సెషన్ ను ముగించక పోతే తాను కార్యక్రమం నుండి తప్పుకుంటానని హెచ్చరించారు.
మెగాస్టార్ ను బెదిరించం సరికాదంటూ మెగా అభిమానులు విరుచుకుపడ్డారు. ఇంత జరిగినా చిరంజీవి పల్లెత్తు మాట అనలేదు. నిశ్శబ్దంగా వెళ్లి గరికపాటి పక్కనే కూర్చున్నారు. ఆయనను తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా కోరారు కూడా.
ఎట్టకేలకు మెగాస్టార్ నోరు విప్పారు. గరికపాటి వృద్దుడని ఆయన తన గురించి చేసిన కామెంట్స్ పై చర్చించాల్సిన అవసరం లేదన్నారు. తాను నటించిన గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్ లో పై విధంగా స్పందించారు.
ఆచార్య చిత్రం ఆడలేదు. కానీ బాధ పడలేదన్నారు. బయ్యర్లను కాపాడుకునేందుకు తాను రామ్ చరణ్ రెమ్యూనరేషన్ లో ఎక్కువ భాగాన్ని నిర్మాతలకు ఇచ్చామని తెలిపారు. దర్శకుడు మోహన్ రాజా అద్భుతంగా తీశాడంటూ కితాబు ఇచ్చారు చిరంజీవి.
Also Read : హుమా ఖురేషీ..ధావన్ హల్ చల్