CM KCR : అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు సీఎం శ్రీ‌కారం

466 అంబులెన్స్ ల‌కు జెండా ఊపిన కేసీఆర్

CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ 466 అత్య‌వ‌స‌ర సేవ‌ల వాహ‌నాల‌ను మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఆరోగ్య రంగానికి త‌మ ప్ర‌భుత్వం ప్ర‌యారిటీ ఇస్తుంద‌న్నారు. ఇందులో భాగంగా అత్య‌వ‌స‌ర సేవ‌లు అత్యంత ముఖ్య‌మ‌న్నారు. ఎమ‌ర్జెన్సీ సేవ‌ల‌ను మ‌రింత ప‌టిష్టం చేసింద‌ని చెప్పారు కేసీఆర్. హైద‌రాబాద్ లోని పీపుల్స్ ప్లాజా వ‌ద్ద 466 అమ్మ ఒడి, అంబులెన్స్ , పార్థివ దేహాల త‌ర‌లింపు వాహ‌నాల‌ను కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.

CM KCR Starts

ఈ మొత్తం వాహ‌నాల‌లో 108 అంబులెన్స్ వాహ‌నాలు 204 , అమ్మ ఒడి వాహ‌నాలు 228, 34 పార్థివ వెహికిల్స్ ఉన్నాయి. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా స‌రే విద్య‌, ఆరోగ్య రంగాల‌పై ఫోక‌స్ పెట్టామ‌ని చెప్పారు సీఎం కేసీఆర్(KCR). రాబోయే రోజుల్లో మ‌రింత‌గా కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

ఆరోగ్య రంగం అభివృద్దికి సంబంధించి కొత్త‌గా తెలంగాణ రాష్ట్రానికి 8 మెడిక‌ల్ కాలేజీల‌ను మంజూరు చేసిన‌ట్లు చెప్పారు కేసీఆర్. ఇవాళ అత్య‌వ‌స‌ర సేవ‌ల వాహ‌నాల‌ను ప్రారంభించిన అనంత‌రం హుటా హుటిన మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేరి వెళ్లారు సీఎం. అక్క‌డ రాష్ట్రంలో అత్యంత పేరు పొందిన కొల్హాపూర్ లోని మ‌హాల‌క్ష్మి టెంపుల్ ను సంద‌ర్శించారు.

Also Read : AP CM YS Jagan : రూ. 600 కోట్లతో 8 వేల మందికి ఉపాధి

 

Leave A Reply

Your Email Id will not be published!