CM KCR Skipped : మోదీ పర్యటనకు కేసీఆర్ డుమ్మా
ప్రజలే కేసీఆర్ ను బహిష్కరిస్తారు
CM KCR Skipped : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణలో కాలు మోపారు. హకీంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలకాల్సి ఉండగా డుమ్మా కొట్టారు. కేసీఆర్ కు బదులు రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా మోదీ టూర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.
తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తూ మోసం చేశారంటూ ప్రధానమంత్రిపై మండిపడ్డారు. అందుకే మోదీ టూర్ ను బహిష్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాగా కేటీఆర్ చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన గంగాపురం కిషన్ రెడ్డి. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ సీఎం విధిగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉందని కానీ సీఎం కేసీఆర్(KCR) వాటిని తుంగలో తొక్కారంటూ ధ్వజమెత్తారు. భారత దేశ చరిత్రలో ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదన్నారు.
అహంకార పూరితంగా, రాచరిక పాలన సాగిస్తున్న భారత రాష్ట్ర సమితిని, సీఎం కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని రాబోయే రోజుల్లో ప్రజలే బహిష్కరిస్తారంటూ జోష్యం చెప్పారు కిషన్ రెడ్డి. సిఎం డుమ్మా కొట్టడం అనేది డ్రామా అంటూ కొట్టి పారేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఢిల్లీలో దోస్తీ తెలంగాణలో కుస్తీ పేరుతో నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు.
Also Read : PM Modi Tour : మోదీకి శ్రీనివాస్ యాదవ్ స్వాగతం