England Squad 5th Test : ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టు డిక్లేర్

15 మంది స‌భ్యుల‌ను ప్ర‌క‌టించిన ఈసీబీ

England Squad 5th Test : క‌రోనా కార‌ణంగా నిలిచి పోయిన ఐదో టెస్టును ఆడ‌బోతోంది భార‌త జ‌ట్టు. మిగిలి పోయిన ఈ టెస్టుతో పాటు వ‌న్డేలు, టి20 మ్యాచ్ లు ఆడ‌నుంది. గ‌త ఏడాది ఐదు టెస్టుల సీరీస్ కు గాను నాలుగు టెస్టులు పూర్త‌య్యాయి.

ఆఖ‌రి టెస్టు స‌మ‌యంలో భార‌త ఆట‌గాళ్లు క‌రోనా పేరుతో తాము ఆడ‌లేమంటూ చెక్కేశారు. ఎవ‌రంత‌కు వారే దుబాయ్ కి వెళ్లి పోయారు. 2021లో అక్క‌డ నిర్వ‌హించిన ఐపీఎల్ లో పాల్గొన్నారు.

ఈ అంశం పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇంగ్లాండ్ క్రికెట్ జ‌ట్టు(England Squad 5th Test) మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సంచ‌ల‌న కామెంట్స్ కూడా చేశారు. భార‌త ఆట‌గాళ్ల‌కు సంప్ర‌దాయ‌మైన ఆట కంటే కాసులు కురిపించే ఐపీఎల్ మీదే ఎక్కువ ఆస‌క్తి అంటూ.

ఇదే విష‌యంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీవ్ర అభ్యంత‌రం తెలిపింది. త‌మ‌కు తీర‌ని న‌ష్టం వాటిల్లిందంటూ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ కు కూడా ఫిర్యాదు చేసింది.

చివ‌ర‌కు బీసీసీఐ స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. 2022లో జ‌రిగే వ‌న్డే, టి20 టూర్ లో భాగంగా మిగిలి పోయిన మ్యాచ్ ను తాము ఆడుతామంటూ వెల్ల‌డించింది.

చివ‌ర‌కు ఐసీసీ జోక్యంతో గొడ‌వ స‌ద్దు మ‌ణిగింది. ఇక టీమిండియాతో జ‌రిగే నిర్ణ‌యాత్మ‌క టెస్టుకు 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది.

ఇప్ప‌టికే స్వ‌దేశంలో న్యూజిలాండ్ కు చుక్క‌లు చూపించింది. క్వీన్ స్వీప్ చేసింది. ప్ర‌క‌టించిన జ‌ట్టు ఇలా ఉంది.

బెన్ స్టోక్స్ కెప్టెన్ . జేమ్స్ అండ‌ర్స‌న్ , జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్ , స్టువ‌ర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్ , జాక్ క్రాలే, బెన్ స్టోక్స్ , జాక్ లీచ్ , లీస్ , ఓవ‌ర్ ట‌న్ , జామీ , మాథ్యూ పాట్స్ , ఆలీ పోప్ , జో రూట్ ఉన్నారు.

Also Read : టీమిండియా జోరు ఐర్లాండ్ బేజారు

Leave A Reply

Your Email Id will not be published!