Hemamalini Mahua Moitra : మ‌హూవాపై హేమమాలిని ఫైర్

బీజేపీ ఎంపీ హేమ‌మాలిని కామెంట్స్

Hemamalini Mahua Moitra : పార్ల‌మెంట్ లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్యవాదం తెలిపే తీర్మానం సంద‌ర్భంగా టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఇప్ప‌టికే అదానీ గ్రూప్ కు సంబంధించిన వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. ప‌లుమార్లు ఉభ‌య స‌భ‌లు వాయిదా ప‌డ్డాయి. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ ముగించారు. ఈ స‌మ‌యంలో ఎంపీ మ‌హూవా షాకింగ్ కామెంట్స్ చేయ‌డం అంద‌రినీ విస్తు పోయేలా చేసింది.

అయితే తాను అన్న దాంట్లో ఎలాంటి త‌ప్పు లేద‌న్నారు మ‌హూవా మోయిత్రా. దీనిపై సీరియ‌స్ గా స్పందించింది న‌టి హేమ‌మాలిని. ఆమె త‌న నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిద‌ని సూచించారు. స‌మాచారం తెలుసు కోకుండా వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేయ‌డం వ‌ల్ల పాపుల‌ర్ కాగ‌ల‌రేమో కానీ ప్ర‌జ‌ల్లో చుల‌క‌నై పోతామ‌ని స్ప‌ష్టం చేశారు హేమమాలిని(Hemamalini Mahua Moitra).

దీనిపై ఎంపీ మ‌హూవా మోయిత్రా లోక్ స‌భ‌లో తాను క‌స్ అనే వ‌ర్డ్ ను వాడ‌డాన్ని స‌మ‌ర్థించారు. తాన ఆపిల్ ను యాపిల్ అని పిలుస్తాన‌ని ఆరెంజ్ అని కూడా అంటాన‌ని చెప్పారు. నేను చెప్పినదంతా రికార్డులో లేద‌న్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై బీజేపీ త‌ప్పుప‌ట్టింది. స‌భ్యులు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించాల్సింది పోయి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారంటూ ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా తాను మాట్లాడుతున్న స‌మ‌యంలో ప‌దే ప‌దే బీజేపీ ఎంపీలు అడ్డు చెప్పారంటూ మండిప‌డ్డారు మ‌హూవా మోయిత్రా. ఇక టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు మాట్లాడుతుండ‌గా మ‌హూవా బీజేపీ ఎంపీ ర‌మేష్ బిధూరిపై నోరు పారేసుకున్నారు.

Also Read : మోదీ పాల‌న‌లోనే ఎదిగిన అదానీ

Leave A Reply

Your Email Id will not be published!