ICC Mens T20 Team : ఐసీసీ పురుషుల టీ20 టీమ్ ఇదే

సూర్య‌..కోహ్లీ..పాండ్యాకు చోటు

ICC Mens T20 Team : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల టీ20 జ‌ట్టును డిక్టేర్ చేసింది. 2022 సంవ‌త్స‌రానికి గాను 11 మంది ప్లేయ‌ర్ల‌తో తుది జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు స్టార్ బ్యాట‌ర్ ఇంగ్లండ్ కు చెందిన జోస్ బ‌ట్ల‌ర్ ను స్కిప్ప‌ర్ గా ఎంపిక చేసింది. ఇక టీంలో ముగ్గురు భార‌త ఆట‌గాళ్లకు చోటు ల‌భించింది.

వారిలో స్టార్ బ్యాట‌ర్లు విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాద‌వ్ కాగా ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాకు ఛాన్స్(ICC Mens T20 Team)  ద‌క్కింది. సోమ‌వారం అధికారికంగా ఐసీసీ ట్విట్ట‌ర్ వేదిక‌గా పూర్తి జ‌ట్టును వెల్ల‌డించింది. ఇంగ్లండ్ టీమ్ నుంచి బ‌ట్ల‌ర్ తో పాటు టాప్ ప్లేయ‌ర్ గా ఇప్ప‌టికే అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాడిగా పేరొందిన సామ్ క‌ర‌న్ ను కూడా చేర్చింది.

ఇక దాయాది పాకిస్తాన్ జ‌ట్టు నుంచి ఓపెన‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ , రౌఫ్ ల‌ను ఎంపిక చేసింది..కానీ అనూహ్యంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ ను ప‌క్క‌న పెట్టంది. మ‌రో వైపు శ్రీ‌లంక నుంచి బంతితో మ్యాజిక్ చేస్తున్న హ‌స‌రంగ‌తో పాటు జింబాబ్వే జ‌ట్టుకు చెందిన సికింద‌ర రజా, ఐర్లాండ్ కు చెందిన జోష్ లిటిల్ ను చేర్చింది. మ‌రో వైపు ఎలాంటి బౌల‌ర్ అయినా స‌రే ఆడే ద‌మ్మున్న ఆట‌గాడిగా పేరొందిన కీవీస్ కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ కు ప్ర‌యారిటీ ఇచ్చింది ఐసీసీ(ICC Mens T20 Team) .

ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే జోస్ బ‌ట్ల‌ర్ కెప్టెన్. రిజ్వాన్ , కోహ్లీ, సూర్య కుమార్ యాద‌వ్ , గ్లెన్ ఫిలిప్స్ , సికింద ర్ రజా , పాండ్యా, సామ్ క‌ర‌న్ , వ‌నిందు , రౌఫ్ , లిటిల్ ఉన్నారు.

Also Read : ఐసీసీ మ‌హిళ‌ల టీ20 జ‌ట్టు డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!