IND vs AUS ICC ODI World Cup : ఆసిస్..భారత్ బిగ్ ఫైట్
గెలిచేది ఎవరు..నిలిచేది ఎవరో
IND vs AUS ICC ODI World Cup : అహ్మదాబాద్ – గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం భారత్, ఆసిస్ జట్ల మధ్య ఐసీసీ(ICC) వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు సర్వం సిద్దమైంది. కోట్లాది మంది ఈ మ్యాచ్ కోసం వేచి చూస్తున్నారు. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇప్పటికే స్టేడియం పోలీసు , భద్రతా దళాల మధ్య నిండి పోయింది. దాదాపు లక్షా 30 వేల మందికి పైగా ఈ మ్యాచ్ ను వీక్షించనున్నట్టు సమాచారం.
IND vs AUS ICC ODI World Cup Final 2023
దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆయా క్రికెట్ అసోసియేషన్స్ క్రికెట్ ఫ్యాన్స్ కోసం బిగ్ స్క్రీన్లను ఏర్పాటు చేశాయి. ప్రత్యేకించి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో ఏపీ లోని 13 చోట్ల వీటిని ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. భారత జట్టు ఇప్పటి దాకా 9 మ్యాచ్ లు ఆడింది. అన్ని మ్యాచ్ లను గెలుపొందింది రోహిత్ సేన. ఇక ఆస్ట్రేలియా ఇప్పటి దాకా 9 మ్యాచ్ లు ఆడి 2 మ్యాచ్ లలో ఓటమి పాలై 7 మ్యాచ్ లలో విజయం సాధించింది.
దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకోవడం. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : Andhra Cricket Association(ACA) : ఏసీసీ ఆధ్వర్యంలో బిగ్ స్క్రిన్స్